
చివరి మజిలీలో గౌరవం ఎక్కడ..?
జనగామ: ‘స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్’ అనే సాంగ్ పుట్టుక, మరణం ఒకటే అనే అర్థం చెబుతుంది. తల్లి కడుపులో నుంచి ప్రపంచాన్ని చూసిన వేళ కుటుంబ సభ్యులు ఎంత సంతోష పడతారో.. చివరి మజిలీలోనూ అలాగే సాగనంపాలనే ‘ఆకలి రాజ్యం’ సినిమా పాట ఎప్పుడూ హిట్టే. పట్టణంలోని నెహ్రూపార్కు 60 ఫీట్ల రోడ్డు ఏరియాలో ఉన్న వైకుంఠ ధామం చూస్తే చచ్చిన వ్యక్తికి సైతం అసహ్యం వేసేలా కనిపిస్తోంది. చెత్త కుప్పలు, దుర్గంధంతో మురికి కూపాన్ని తలపిస్తోంది. వర్షాలు కురిస్తే మోకాలి లోతు నీరు. అక్కడ పది నిమిషాలు కూడా కూర్చోలేని పరిస్థితి. జిల్లా కేంద్రంలోని 75 శాతం జనాభాకు ఈ వైకుంఠ ధామమే దిక్కు. చివరి మజిలీలో చనిపోయిన వ్యక్తికి గౌరవ ప్రదమైన వీడ్కోలు లేకుండా పోతున్నది. మున్సిపల్ అధికారులు ఒక్కసారి అటువైపు వెళ్లి చూస్తే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. చెత్త డంపింగ్ కేంద్రంగా మారిన వైకుంఠ ధామాన్ని ఆహ్లాదకరంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.
చెత్త డంపులు.. మురికి కూపాలు
దుర్గంధం వెదజల్లుతున్న వైకుంఠ ధామం

చివరి మజిలీలో గౌరవం ఎక్కడ..?