
చినుకు జాడేది..?
జనగామ: వానాకాలం సీజన్కు ముందు మోస్తరు వర్షాలతో ఆశపుట్టించిన వరుణుడు.. రైతులు నార్లు పోసి, దుక్కులు దున్ని, పత్తి గింజలు పెట్టిన తర్వా త ముఖం చాటేశాడు. వేలాది రూపాయలు పెట్టుబడిపెట్టి సాగు చేసిన పంటకు తడిలేక ఎండుతుంటే చూసి తట్టుకోలేక అన్నదాత కన్నీటి పర్యంతమవుతున్నాడు. యాసంగి సీజన్లో వర్షాభావ పరిస్థితులు, కరువుతో 30 శాతం పంట దిగుబడి కోల్పోయి న రైతన్నలు ఆశలన్నీ వానాకాలంపై పెట్టుకున్నా రు. ఈ సీజన్ ఆరంభంలోనే వర్షాలు గడిబిడ చేస్తుండడంతో.. భవిష్యత్పై టెన్షన్గా ఉన్నారు.
3.40 లక్షల ఎకరాల్లో సాగు అంచనా
జిల్లాలో వానాకాలం సీజన్లో వరి 2.15 లక్షలు, పత్తి 1.25లక్షలు.. అన్ని పంటలు కలుపు కుని 3.40 లక్షల ఎకరాల వరకు సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నెల రోజుల నుంచి సాగు పనులు మొదలయ్యాయి. దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకున్న అన్నదాతలు నాట్ల కోసం నారు సిద్ధం చేసుకున్నారు. నర్మెట, పాలకుర్తి, లింగాలఘణపురం, దేవరుప్పుల, రఘునాథపల్లి, స్టేషన్ఘన్పూర్, జఫర్గఢ్, పాలకుర్తితో పాటు జనగామ ప్రాంతంలోని పలు గ్రామాల్లో సుమారు 40 వేల ఎకరాలకు పైగా పత్తి గింజలు విత్తుకున్నారు. గత నెల 24వ తేదీ వరకు అడపా దడపా వర్షాలు కురవడంతో 10 నుంచి 15వేల ఎకరాల్లో వరి నాట్లు సైతం వేశారు. ప్రస్తుతం భూగర్భ జలాలు 10 మీటర్ల లోతుకు పడిపోగా.. 80శాతం మేర బోర్లు ఒట్టి పోయాయి. బోరు బావుల ద్వారా సాగునీరు అందించలేని పరిస్థితుల్లో.. రైతులు కేవలం వర్షాలపైనే ఆధారపడ్డారు. గత నెల 25వ తేదీ నుంచి వర్షాల జాడ లేక పోవడంతో నారు మళ్లు, నాట్లు వేసిన పొలా లు, పత్తి విత్తనాలు ఎండిపోయి మట్టిలో కలిసిపోయే ప్రమా దం ముంచుకొస్తోంది. దీంతో రైతులు పెట్టుబడులు నష్టపోయే అవకాశం ఉంది. రోహిణీ కార్తె ముగిసి నేటి నుంచి మృగశిర కార్తె మొదలు కానుంది. వరణుడు ముఖం చాటేయడంతో సీజన్ పరిస్థితిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా కొందరు అప్పులు చేసి బోర్లను రీఫ్రెష్ చేయిస్తుండగా.. మరికొందరు కొత్తగా వేయిస్తున్నారు.
మే నెలలో కురిసిన
వర్షపాతం వివరాలు
మురిపించి.. ముఖం చాటేసి
15 రోజులుగా అడ్రస్లేని వానలు
మొలకెత్తని పత్తి గింజలు
ఎండుతున్న వరి నారు మళ్లు
ఆందోళనలో అన్నదాతలు
తేదీ మిల్లీమీటర్లు
10 1.1
11 1.1
14 4.2
15 2.6
16 3.5
17 9.5
19 0.4
20 0.4
21 10.3
22 12.2
23 0.7
24 7.3

చినుకు జాడేది..?

చినుకు జాడేది..?