
పూర్తిస్థాయిలో అందని దుస్తులు, నోట్బుక్స్
బుధవారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోu
ఉన్నత
103
ఓపీఎస్ అమలు చేయాలి
జనగామ: విద్యుత్ శాఖ ఉద్యోగులకు కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేయాలని జనగామ సర్కిల్ జీపీఎఫ్ సాధన సమితి సభ్యులు కోరారు. ఈ మేరకు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ సాధన సమితి ఆదేశాల మేరకు మంగళవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని కలిసి మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత పెన్షన్ విధానం పునరుద్ధరించే విధంగా అసెంబ్లీలో తమ తరఫున ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి విద్యుత్ ఉద్యోగులు పక్షాన అసెంబ్లీలో ప్రస్తావించి న్యాయం చేసే విధంగా ముందుంటా నని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జంపత్కుమార్, భూక్య బాలు, రాజేష్, నర్సయ్య, కనకచారి, వెంకట్రెడ్డి, వెంకటయ్య, కనకసేన, సురేందర్, భిక్షపతి పాల్గొన్నారు.
ఉపాధి పనుల పరిశీలన
నర్మెట: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులపై 4వ సా మాజిక తనిఖీలో భాగంగా బొమ్మకూర్లో జరి గిన పనులపై మంగళవారం కేంద్ర బృందం పరిశీలించింది. మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో చేపట్టిన పనుల వివరాలు, రికార్డులను పరిశీలించి ప్రజల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అలాగే పెన్షన్ పథకం, పీఎంజేజేఎస్వై, పీఎంకేఎస్వై పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రతీఒక్కరూ ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలన్నా రు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బోడపాటి అరవింద్ చౌదరి, టీం అధికారులు పుష్పలత కుమారి, ఎస్ఎస్ఓ అంకిత్, అదనపు డీఆర్డీఓ చంద్రశేఖర్, డీపీఎం వినీతా రెడ్డి, ఈసీ శ్రీనివాస్ రెడ్డి, ఏపీఎం మాదారపు రవి, ఏపీఓ రమాదేవి, ఏఈ పీఆర్ ప్రదీప్ కుమార్, సీసీ కవిత, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం
జనగామ: రాష్ట్రం అభివృద్ధి ప్రధాని నరేంద్రమోదీతోనే సాధ్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలో మోదీ 11 సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశాన్ని నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్ యాదవ్, పార్లమెంటు కోకన్వీనర్ కొంతమంది శ్రీనివాస్, కల్నల్ భిక్షపతి, జిల్లా ఉపాధ్యక్షుడు దేవర ఎల్లయ్య, నాయకులు బాగాల నవీన్రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ద జగదీష్, చిల్పూర్ మండల అధ్యక్షుడు గంటి ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.
15 రోజుల తర్వాత..
జనగామలో భారీ వర్షం
జనగామ: జనగామ పట్టణంలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత నెల 25 నుంచి ముఖం చాటేసిన వరుణుడు ఒక్కసారిగా కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాలుగా ఉక్కపోతతో సతమతమవుతున్న పట్టణ ప్రజలు చల్లని వాతావరణంతో ఉపశమనం పొందారు.
వికసించిన బ్రహ్మకమలం
కొడకండ్ల: ఎంతో విశిష్టమైన బ్రహ్మకమలం పుష్పం మండలంలోని మొండ్రాయి గ్రామానికి చెందిన తోట కర్ణాకర్లక్ష్మి పటేల్ ఇంటిలో వికసించింది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే వికసించే ఈ పుష్పం మంగళవారం వికసించడంతో యజమానులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
విద్యార్థులు
38,000
(పెరగవచ్చు)
ప్రాథమికోన్నత
64
పీఎస్
341
జిల్లాలో
పాఠశాలలు,
విద్యార్థుల
వివరాలు
అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలుపుతున్న జర్నలిస్టులు, వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు
జనగామ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీయాలను పత్రికారంగానికి ముడిపెడుతూ సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా ప్రజల పక్షాన నిలబడుతున్న సాక్షి మీడియాపై దాడులు చేయించడం సహించరానిదని సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్. రాజారెడ్డి ధ్వజమెత్తారు. ‘కొమ్మినేని’ని ఏపీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం జిల్లా కేంద్రం ఆర్టీసీ చౌరస్తా అంబేడ్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బీజేపీ, వామపక్ష, ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపారు. నల్లబ్యాడ్జీలతో జంక్షన్లో ర్యాలీ నిర్వహించి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రాజారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులతో జర్నలిస్టులకు సంకెళ్లు వేయాలని చూస్తుందన్నారు. వెంటనే శ్రీనివాసరావును విడుదల చేసి సీఎం క్షమాపణ చెప్పాలన్నారు. అనంతరం సీనియర్ జర్నలిస్టు కన్నా పర్శరాములు మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు తనగోతి తానే తవ్వుకుంటున్నారన్నారు. జర్నలిస్టులతో పెట్టుకున్న ఏ నాయకుడు కూడా కాలగర్భంలో కలిసి పోయాడన్నారు. టీయూడబ్ల్యూజేఏ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వెంకటస్వామి మాట్లాడుతూ మొన్న సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి, నేడు సీనియర్ పాత్రికేయుడు శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్లు చేస్తూ పత్రికా రంగంపై గొడ్డలి పెట్టుగా మారిందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ మాట్లాడుతూ ఏపీలో చంద్రబాబు సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐజేయూబ్ల్యూజేఏ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, టీయూడబ్ల్యూజే 143 జిల్లా ప్రధాన కార్యదర్శి జాల రమేష్, హింజె మాధవరావు, భాస్కర్, కన్నారపు శివశంకర్, గూడూరు కరుణాకర్, కిషోర్, కేమిడి ఉపేందర్, చౌదర్పల్లి ఉపేందర్, కొత్తపల్లి కిరణ్కుమార్, గోవర్దనం వేణుగోపాల్, బండి శ్రీనివాస్రెడ్డి, రాణా ప్రతాప్, గణేష్, శ్రీని వాస్, మంగ శంకర్, సుప్రీం, యూసుఫ్, వినయ్, ఎజాజొద్దీన్, ఉదయ్ కిరణ్, మోహన్, బాబా, వెంకన్న, రాజు, అశీష్, బీజేపీ నాయకులు దేవరాయ ఎల్లయ్య, పెద్దోజు జగదీష్, సుడిగెల భిక్షపతి తదితరులు ఉన్నారు.
పర్యావరణ పాఠ్యపుస్తకాలకు మోక్షమెప్పుడో?
ఉన్నత స్థాయిలో 9, 10 తరగతులు చదువుకునే విద్యార్థులకు అదనంగా పర్యావరణం సబ్జెక్టు ఉంటుంది. ఇందుకు సంబంధించి వీటికి ఇంటర్నల్ మార్కులు వేస్తారు. జిల్లాలో 2,14,460 పాఠ్యపుస్తకాలు అవసపరముండగా, ఇప్పటి వరకు 2,04,410 జిల్లాకు చేరుకున్నాయి. వీటిలో 1,82,596 పుస్త కాలను బడులకు పంపించారు. ఇంకా 10,050 పుస్తకాలు రావాల్సి ఉంది. అలాగే బడిబాటలో కొత్తగా చేరిన విద్యార్థులకు పాఠ్య, నోటు పుస్తకాలతో పాటు రెండు జతల యూనిఫాంలను అందించాల్సి ఉంటుంది. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే వీటికి సంబంధించిన నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపిస్తారు.
వాహనంలో తరలిస్తున్న పాఠ్యపుస్తకాలు
జనగామ: వేసవి సెలవుల అనంతరం రేపటి (గురువారం) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. బడి ప్రారంభానికి ముందుగానే సర్కారు బడుల విద్యార్థులకు రెండు జతల దుస్తులు, నోటు, పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం ముందుగానే స్పష్టం చేసింది. యూనిఫాం విషయంలో ఒక జత వరకే సరిపెడుతుండగా...ప్రాథమిక పాఠశాలలకు వర్క్బుక్స్, 9, 10 తరగతులకు పర్యావరణ పుస్తకాలను నేటికీ పంపించలేదు. కొత్తగా అడ్మిషన్లు పొందే విద్యార్థులకు సైతం పాఠ్యపుస్తకాలు ఇప్పట్లో అందే పరిస్థితి ఉండదు.
జిల్లాలో 508 పాఠశాలలు..
జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 508 ఉన్నాయి. ఇందులో 38 వేలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కో విద్యార్థికి గత కొన్ని సంవత్సరాలుగా పాలక ప్రభుత్వాలు రెండు జతల యూనిఫాంలను ఉచితంగా అందిస్తున్నారు. వేసవి సెలవులకు ముందుగానే జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు పిల్లల వివరాలు, యూనిఫాం ఇండెంటును సర్కారు పంపించారు. ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాయింట్, షర్టు, ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయి పిల్లలకు నిక్కర్, షర్టు లెక్కన క్లాత్ పంపించారు. నిక్కర్పై విద్యార్థులు ఆక్షేపన చెప్పడంపై సాక్షిలో ప్రచురితమైన కథనంతో సర్కారు స్పందించింది. ఒకటి నుంచి 10 వరకు పాయింట్ స్టించ్చింగ్ చేయించాలని విద్యాశాఖను ఆదేశించిన సంగతి పాఠకులకు తెలిసిందే. నిక్కర్కు వచ్చిన క్లాత్ను అడ్జెస్ట్మెంట్ చేసి పాయింట్కు కన్వర్ట్ చేయడంతో కొంత కొరత ఏర్పడింది. విద్యాశాఖ ఇండెంట్ ప్రకారం ఒక్కో విద్యార్థికి రెండు జతల దుస్తుల చొప్పున 58,316 దుస్తులు అవసరముండగా, మొదటి విడతలో 29,158 జతలను స్టిచ్చింగ్ చేయింస్తున్నారు. ఇందులో 9వ తేదీ వరకు 26,724 జతల యూనిఫాం తయారీ కాగా, మిగతావి స్టించ్చింగ్ చేస్తున్నారు. వీటిని హెచ్ఎంల సమక్షంలో ఆయా పాఠశాలకు పంపించారు. రెండవ జతకు సంబంధించి ప్రభుత్వం నుంచి క్లాత్ రావాల్సి ఉంది.
పూర్తిస్థాయిలో పంపిణీ కాని వర్క్బుక్స్
జిల్లాలో 508 ప్రభుత్వ పాఠశాలల్లో చదువకునే విద్యార్థులకు నోటు పుస్తకాల (రాసుకునేవి) సైతం ఉచితంగా అందిస్తున్నారు. ఈసారి ప్రభుత్వం జిల్లా విద్యాశాఖకు సంబంధం లేకుండా నేరుగా పాఠశాలలకే సప్లయ్ చేసింది. ఒకటి నుంచి 5 తరగతుల వరకు ఒక్కో విద్యార్థికి 4 వర్క్బుక్స్, 6 నుంచి 7 వరకు 6, 8 నుంచి 10 తరగతుల పిల్లలకు 14 చొప్పున నోట్బుక్స్ను ఉచితంగా అందించనున్నారు. 6 నుంచి 10 వరకు విద్యను అభ్యసించే విద్యార్థులకు నోటు బుక్స్ రాగా, ప్రాథమిక స్థాయిలో ఇప్పటి వరకు నోట్బుక్స్ రాలేదు. పాఠశాలల పునఃప్రారంభానికి ఒక్కరోజే ఉండటంతో పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలనే దానిపై ఉపాధ్యాయులు మల్లగుల్లాలు పడుతున్నారు.
త్వరలో పూర్తిస్థాయిలో పంపిణీ చేస్తాం..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు రెండు జతల యూనిఫాంకు సంబంధించిన క్లాత్ మరో పది రోజుల్లో జిల్లాకు రానుంది. ప్రాథమిక పాఠశాలలకు రావాల్సిన వర్క్బుక్స్ కూడా వచ్చాయి. మూడు రోజుల్లో పంపిణీ చేస్తాం. 9, 10వ తరగతులకు రావాల్సిన పర్యావరణం పాఠ్యపుస్తకాలు సైతం త్వరలోనే రానున్నాయి. ఈ పుస్తకాలు కొంచెం ఆలస్యమైన ఇబ్బంది ఉండదు.
– భోజన్న, జిల్లా విద్యాశాఖ అధికారి
● యాసంగిలో ములుగు జిల్లా వెంకటాపురం, కన్నాయిగూడెం, వాజేడు, మండలాల్లోని 55 గ్రామాల్లో పేరొందిన కంపెనీలవని నమ్మిన రైతులు.. 1,370 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. అవి నకిలీవి కావడంతో 618 మంది రైతులు నష్టపోగా, అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదయ్యాయి.
● గత మార్చి నెలాఖరులో హనుమకొండ జిల్లాలో రూ.78.63 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను పోలీసులను పట్టుకున్నారు. ఈ ముఠాసభ్యులు గతంలో కూడా నకిలీ పత్తి, మొక్కజొన్న విత్తనాలు విక్రయించినట్లు కేసులున్నాయి.
● తాజాగా వరంగల్ టాస్క్ఫోర్స్, గీసుకొండ, పరకాల పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురుని అరెస్టు చేసి రూ.63.62 లక్షల విలువ చేసే 166 కిలోల నకిలీ విత్తనాలు, 800 లీటర్ల గడ్డిమందు, నకిలీ పురుగుల మందు తయారీకి అవసరమైన సామగ్రి, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రస్తుత వానాకాలం సీజన్కు నకిలీ పత్తి విత్తనాలు పోటెత్తుతున్నాయి. ఓ వైపు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాలనుంచి భారీగా రవాణా అవుతుండగా.. మరోవైపు ముఠాలుగా ఏర్పడిన కొందరు ఉమ్మడి వరంగల్వాసులు ఈ ‘నకిలీ’లను మార్కెట్లో విక్రయిస్తున్నారు. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలను కేంద్రాలుగా చేసుకొని ఈ దందా సాగిస్తున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ముందు జాగ్రత్తగా టాస్క్ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో బయటపడిన నకిలీ విత్తనాలే ఇందుకు ఉదాహరణ.
వరి తర్వాత పత్తివైపే రైతుల మొగ్గు..
ఉమ్మడి వరంగల్లో వరి తర్వాత రైతులు పత్తి సాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. గత వానాకాలంలో 15,83,692 ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. ఇందులో 8.72 లక్షల ఎకరాల్లో వరి పంటలు వేయగా, 6.17 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. సుమారుగా 1.14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, శనగ, పెసర తదితర పంటలు సాగయ్యాయి. గత వానాకాలం సాగు విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకున్న వ్యవసాయశాఖ.. ఈ సీజన్లో 15.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉందని, ఇందులో 9.02 లక్షల ఎకరాల్లో వరి, 5.67 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు వేస్తారని అంచనా వేసింది. పత్తి వర్షాధార పంట కావడంతో ఈ నెల రెండు, మూడు వారాల్లో విత్తుకునేందుకు 20 రోజుల ముందునుంచే విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఈ మేరకు 5.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కోసం ఎకరానికి రెండు బస్తాల చొప్పున సుమారు 11,34,716 ప్యాకెట్లు అవసరం. ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా బీటీ–2 రకం వాడకంలో ఉండగా, ఈ సారి బీటీ–3 పేరిట వ్యాపారులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు విత్తనాల కొనుగోలు విషయంలో ఏటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు.
బ్లాక్ మార్కెట్లో విత్తనాలు..
రూ.400 వరకు అదనం..
ఉమ్మడి జిల్లాలో ఈసారి 5,67,358 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేసిన వ్యవసాయశాఖ అధికారులు.. ఆ మేరకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. కానీ ఓవైపు నకిలీ బెడద.. మరోవైపు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎకరానికి 475 గ్రాములున్న విత్తన ప్యాకెట్లు రెండు అవసరం కాగా.. ఉమ్మడి జిల్లాకు 11.35 లక్షల విత్తన ప్యాకెట్లు కావాల్సి ఉంది. ఈ మేరకు నిల్వలు ఉన్నాయని అధికారులు చెప్తున్నా... కొందరు డీలర్లు, వ్యాపారులు మాత్రం సరిపడా రాలేదంటున్నారు. బీటీ–2 రకాలకు మార్కెట్లో డిమాండ్ ఉండగా ఇప్పటినుంచే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కాగా బీటీ–2 రకాలకు చెందిన ఒక్కో ప్యాకెట్ను రూ.901లకు విక్రయించాల్సిన వ్యాపారులు లేవు.. లేవంటూ రూ.1,350ల నుంచి రూ.1,450ల వరకు అమ్ముతున్నట్లు చెబుతున్నారు. వర్షాలు పడితే ఆ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
న్యూస్రీల్
సీడ్.. ఫ్రాడ్..
రైతుల మెడపై నకిలీ విత్తనాల కత్తి
సీజన్ ఆరంభంనుంచే దందా
పత్తి విత్తనాల కృత్రిమ కొరత... తప్పని అధిక ధరల మోత
పత్తి, వరి విత్తనాల్లోనే నకిలీ ఎక్కువ.. ఇటీవల పట్టుకున్న పోలీసులు
నిఘా పెంచాలని కోరుతున్న రైతులు
మరిన్ని ఫొటోలు, వివరాలు
సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్.రాజారెడ్డి
జర్నలిస్టులు, వామపక్ష, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన, ర్యాలీ
9, 10 తరగతులకు పర్యావరణ పాఠ్యపుస్తకాలకు మోక్షమెప్పుడో ?
రేపటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం
– 9లోu
జిల్లాల వారీగా పత్తిసాగు, విత్తనాల అంచనా...
జిల్లా సాగు అంచనా అవసరమయ్యే
(ఎకరాల్లో..) విత్తన ప్యాకెట్లు
హనుమకొండ 85,000 1,70,000
వరంగల్ 1,22,358 2,44,716
మహబూబాబాద్ 84,070 1,68,140
జేఎస్ భూపాలపల్లి 1,01,500 2,03,000
జనగామ 1,45,000 2,90,000
ములుగు 29,430 58,860

పూర్తిస్థాయిలో అందని దుస్తులు, నోట్బుక్స్

పూర్తిస్థాయిలో అందని దుస్తులు, నోట్బుక్స్

పూర్తిస్థాయిలో అందని దుస్తులు, నోట్బుక్స్

పూర్తిస్థాయిలో అందని దుస్తులు, నోట్బుక్స్

పూర్తిస్థాయిలో అందని దుస్తులు, నోట్బుక్స్

పూర్తిస్థాయిలో అందని దుస్తులు, నోట్బుక్స్

పూర్తిస్థాయిలో అందని దుస్తులు, నోట్బుక్స్