NIRAMAI Health Analytix క్యాన్సర్‌ అవగాహన పెరిగేలా! | Geetha Manjunath on AI-powered breast cancer detection | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ అవగాహన పెరిగేలా!

Jun 10 2025 10:35 AM | Updated on Jun 10 2025 10:51 AM

Geetha Manjunath on AI-powered breast cancer detection

దిక్సూచి

బ్రెస్ట్‌–క్యాన్సర్‌కు సంబంధించిన జాగ్రత్తలు, నవీన సాంకేతికత గురించి వివిధ సదస్సుల ద్వారా మహిళలకు అవగాహన కలిగిస్తోంది గీతా మంజునాథ్‌ (Geetha Manjunath). తన వ్యక్తిగత ప్రయాణం నుంచి మొదలు హెల్త్‌కేర్‌ సిస్టమ్‌లో ఎదురయ్యే సవాళ్లు, ప్రాణాలను కాపాడటంలో సాంకేతిక పరిజ్ఞానం  ప్రాధాన్యత... ఇలా ఎన్నో విషయాలను మంజునాథ్‌ ప్రేక్షకులతో పంచుకుంటుంది.

రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు వీలు కల్పించే హెల్త్‌ టెక్‌ కంపెనీ ‘నిరామై హెల్త్‌ ఎనలటిక్స్‌’కు (NIRAMAI Health Analytix) గీతా మంజునాథ్‌ ఫౌండర్, సీయీవో. ‘ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌’ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ, కెల్లాగ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెనేజ్‌మెంట్‌ నుంచి మేనేజ్‌మెంట్‌ డిగ్రీ చేసింది. మెషిన్‌ లెర్నింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌లలో గీతకు దశాబ్దాల అనుభవం ఉంది.

ఇదీ చదవండి: Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్‌ లుక్‌లో అఖిల్- జైనబ్‌

భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను విప్లవాత్మకంగా మార్చాలనే NIRAMAI లక్ష్యానికి ఈ వ్యక్తిగత విషాదం ఉత్ప్రేరకంగా మారింది. మంజునాథ్ ఇద్దరు దగ్గరి కుటుంబ సభ్యులిద్దరికీ చివరి దశలో రొమ్ము క్యాన్సర్‌ నిర్ధారణ అయింది. ఆరు నెలల్లోపే, సమీప బంధువులు, భారతి ,లక్ష్మి ఇద్దరూ, నాల్గవ దశలో నిర్ధారణ అయి ప్రాణాలు కోల్పోయారు.  ఇది ఆమెను మానసికంగా తీవ్రంగా దెబ్బతింది. కృత్రిమ మేధస్సులో తన నైపుణ్యాన్ని కార్యాచరణగా మార్చుకుంది. 

బెంగళూరులో జరిగిన ‘షీస్పార్క్స్‌’ సదస్సులో రొమ్ము క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ కోసం రూపొందించిన ఏఐ ఆధారిత వైద్య పరికరం థర్మాలిటిక్స్‌ గురించి వివరించింది.  ‘‘భారతదేశంలో, దాదాపు 50శాతం మంది మహిళలు రెండు-ఐదు సంవత్సరాలలోపు మరణిస్తున్నారు. అయినారొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. ఇది అన్ని క్యాన్సర్‌లలో అత్యంత నయం చేయదగినది’ అంటుంది గీతా మంజునాథ్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement