
స్కావెంజర్ల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి
జనగామ రూరల్: స్కావెంజర్ల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవా రం జిల్లా కమిటీ ఆధ్వర్యాన డీఈఓ భోజన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత విద్యా సంవత్సరం పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించి కేవలం మూడు నెలలకు మాత్రమే వేతనాలు చెల్లించారని అన్నారు. గత వేసవిలో ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థులకు ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు పీపీఎల్స్ మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నల్లనాగుల రాజు, ప్రధాన కార్యదర్శి అంకుషావలి, జిల్లా బాధ్యులు, శ్రీహరి, శ్రీరామ్, రాజారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.