రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం

Jun 13 2025 5:25 AM | Updated on Jun 13 2025 5:25 AM

రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం

రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం

తరిగొప్పుల: భూభారతి రెవెన్యూ సదస్సులతో రైతుల భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న భూ భారతి రెవెన్యూ సదస్సును ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మహిపాల్‌రెడ్డి, డీటీ మందాడపు రామారావు, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకోవాలి

జనగామ రూరల్‌: ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకోవాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ సూచించారు. గురువారం జనగామ మండలం ఎర్రకుంట తండాలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇంటిని ఎంత త్వరగా పూర్తి చేస్తే బిల్లులు కూడా త్వరగా అందుతాయన్నారు. తండాకు చెందిన మాలోతు అనితను ఇంటి నిర్మాణం వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement