
అర్హులందరికీ సంక్షేమ పఽథకాలు
బచ్చన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పఽథకాలు అందిస్తోందని ఎవరూ నిరుత్సాహ పడొద్దని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. గురువారం మండల మండలంలోని సాల్వాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లను దశల వారీగా ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి అందిస్తామన్నారు. పదేళ్లుగా ఎదురు చూస్తున్న సొంతింటి కల కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్రెడ్డి హయాంలో నెరవెరబోతోందన్నారు. అలాగే గ్రామంలో రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్, దేవస్థాన చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, నాయకులు జంగిటి విద్యానాఽథ్, హరిబాబుగౌడ్, వెంకటేశ్, రవీందర్రెడ్డి, అల్వాల ఎల్లయ్య, సందీప్, మసూద్, బాలకిషన్గౌడ్, హరీష్, రాములు, స్వామి, రమేశ్, బాలరాజు, సురేందర్రెడ్డి, పలువురు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి