ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్‌.. ఏడుగురు మృతి | Uttarakhand helicopter crashed Gaurikund | Sakshi
Sakshi News home page

భారత్‌లో మరో ప్రమాదం.. ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్‌

Jun 15 2025 8:09 AM | Updated on Jun 15 2025 1:30 PM

Uttarakhand helicopter crashed Gaurikund

డెహ్రాడూన్‌: అహ్మాదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం నుంచి కోలుకోకముందే.. మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్‌ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్‌ కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందారు. సదరు హెలికాప్టర్‌ డెహ్రాడూన్‌ నుంచి కేదార్‌నాథ్‌ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.

వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఉదయం హెలికాప్టర్‌ కూలిపోయింది. ఆర్యన్‌ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్‌ ఆదివారం తెల్లవారుజామున 5:20 గంటలకు గుప్తకాశీ నుంచి కేదార్‌నాథ్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్‌ గౌరీకుండ్‌ అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో ఏడుగురు ఉండగా.. పైలట్‌తో సహా అందరూ మృతిచెందారు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు.. సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. వీరంతా ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందిన వారిగా గుర్తించారు. 

మృతుల వివరాలు..
రాజ్‌వీర్‌- పైలట్‌. 
విక్రమ్‌ రావత్‌,
వినోద్‌, 
త్రిష్టి సింగ్‌, 
రాజ్‌కుమార్‌, 
శ్రద్దా, 
రాశి(10)..  
 

 

మరోవైపు.. హెలికాప్టర్‌ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ఆయన ట్విట్టర్‌ వేదికగా..‘రుద్రప్రయాగ జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదం గురించి తెలిసింది. ఇది చాలా విచారకరం. SDRF, స్థానిక పరిపాలన, ఇతర రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ప్రయాణికులందరి భద్రత కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement