
వైఎస్ జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో అడుగడుగునా అభిమానం పోటెత్తింది. పోలీసుల ఆంక్షలను సైతం పట్టించుకోకుండా దారి పొడువునా పార్టీ కార్యకర్తలు, అభిమానులు బారులు తీరారు. జై జగన్.. జైజై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఆ అభిమానానికి మురిసిపోయిన జననేత వాళ్లకు ఆప్యాయంగా అభివాదం చేశారు.













