
మోదీతోనే అభివృద్ధి సాధ్యం
లింగాలఘణపురం: దేశ అభివృద్ధి ప్రధానమంత్రి నరేంద్రమోదీతోనే సాధ్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో ఆ పార్టీ మండల అధ్యక్షుడు కొండబోయిన సంపత్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంతో పాటు రాష్ట్రంలో కూడా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, నేనషల్ హైవేల అభివృద్ధి వంటి పనులు జరుగుతున్నాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు దేవరాయ ఎల్లయ్య, సోమిడి వెంకట్రెడ్డి, నాగరాజు, సతీష్, గణేష్, కార్తీక్, సాయికుమార్, శర్మ, రవి, అనిల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.