
ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం
జనగామ రూరల్: ప్రజావ్యతిరే విధానాలపై ప్రజానాట్యమండలి కళారూపాల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఐలమ్మనగర్లో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి నాటక శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు భూనాద్రి వెంకటేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజానాట్యమండలి కళారూపాలు ప్రజల పక్షాన నిత్యం పోరాడే ఆయుధాలన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ముఖ్య ఘట్టాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో భాగంగా వీర తెలంగాణ నాటకాన్ని ప్రజానాట్యమండలి జిల్లా కళాకారులు నేర్చుకోవడం జరుగుతుందన్నారు. ఈ కళారూపాలను జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రదర్శిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సుంచు విజేందర్, జోగు ప్రకాశ్, శివ ప్రసాద్, నరసింహ స్వామి, బాలమని, ప్రమీల, లత, భాగ్య తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి