
World Crocodile Day ను ప్రతీ ఏడాది జూన్ 17న జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని తొలిసారిగా 2017లో జరుపుకున్నారు. మొసలి పరిశోధన కూటమి దీన్ని మొదలు పెట్టింది., ది బెలిజ్ జూ & ట్రాపికల్ ఎడ్యుకేషన్ సెంటర్ ప్రారంభించాయి.
ప్రాముఖ్యత:
అనేక నదులు , చిత్తడి ప్రాంతాల పర్యావరణ వ్యవస్థలో మాంసాహారాలుమొసళ్లు. నీరు , భూమి పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో మాంసాహారులుమొసళ్ళు సహాయపడతాయి.
మొసళ్ళు అంతరించిపోతే, ఆహార గొలుసు తీవ్రంగా ప్రభావితమవుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మొసళ్ళ గురించి ఆసక్తికరమైన విషయాలు: ప్రపంచంలో దాదాపు 23 జాతుల మొసళ్ళు ఉన్నాయి.
ఉప్పునీటి మొసలి ప్రపంచంలోనే అతిపెద్ద సరీసృపాలు - ఇది 7 మీటర్ల పొడవు ,1000 కిలోల వరకు బరువు ఉంటుంది.గుడ్లు పెట్టడం ద్వారా జాతిని వృద్ధి చేస్తాయి.
భారతదేశంలో మొసళ్ల స్థితి:
భారతదేశంలో మూడు ప్రధాన జాతులు కనిపిస్తాయి:
మగ్గర్ లేదా మార్ష్ మొసలి
ఉప్పునీటి మొసలి
ఘరియల్
ఘరియల్ను IUCN తీవ్రంగా ప్రమాదంలో ఉన్నట్లు ప్రకటించింది.
భారతదేశంలో 1975లో "మొసలి సంరక్షణ ప్రాజెక్ట్" ప్రారంబించారు.దీని ఫలితంగా ఒడిశాలోని భితార్కనికా వంటి ప్రాంతాలలో వాటి సంఖ్య భారీగా పెరిగింది.
పరిరక్షణ సవాళ్లు: నదీ తీరాలు అక్రమణలకు గురవుతున్న నేపథ్యంలో వీటి ఉనికి ప్రమాదంలో పడింది. మొసళ్లు అంతరించిపోవడంలో వేట(చర్మం, మాంసం, మందుల కోసం) అనేది మరో ప్రధాన కారణం. చేపల వేటలో చిక్కుకోవడం వల్ల మరి కొన్నిమరణాలు సంభవిస్తున్నాయి.
ఆకర్షించిన సైకత మొసళ్లు
రాష్ట్రంలో మొసళ్ల సంతతి సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రాజెక్టు క్రోకోడైల్ ఇన్ ఒడిశా’ కార్యక్రమం చేపట్టి మంగళవారం నాటికి 50 ఏళ్లు పూర్తయింది. మరోవైపు ప్రపంచ మొసళ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని పూరీ సాగర తీరంలో పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత మొసళ్లు పర్యాటకులను విశేషంగా ఆకర్షించాయి.