సైకత శిల్పంలో జగన్నాథుని వైభవం | Sand sculpture of Lord Jagannath with 100 miniature chariots by Sudarsan Pattnaik mesmerizes devotees | Sakshi
Sakshi News home page

సైకత శిల్పంలో జగన్నాథుని వైభవం

Jul 16 2026 10:03 AM | Updated on Jul 16 2026 10:03 AM

Sand sculpture of Lord Jagannath with 100 miniature chariots by Sudarsan Pattnaik mesmerizes devotees

పూరీ: ఒడిశాలోని పూరీ తీరంలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి, పద్మశ్రీ పురస్కార గ్రహీత సుదర్శన్ పట్నాయక్ అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. ఇది భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సుదర్శన్ పట్నాయక్ మహాప్రభు జగన్నాథుని ప్రతిరూపాన్ని ఇసుకతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ ప్రధాన శిల్పం చుట్టూ 100 చిన్ని ఇసుక రథాలను రూపొందించడం విశేషం.
 

రథయాత్రలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి ఆలయం నుంచి బయటకు వచ్చి భక్తులకు దర్శనమిచ్చే పవిత్ర ఘట్టాన్ని ఈ శిల్పం కళ్లకు కడుతున్నది. కులమతాలకు అతీతంగా అందరినీ ఆశీర్వదించే దైవత్వానికి, సమానత్వానికి రథయాత్ర ప్రతీకగా నిలుస్తుంది. ఏటా రథయాత్ర సమయంలో పూరీ తీరంలో సుదర్శన్ పట్నాయక్ రూపొందించే ఇసుక శిల్పాలు పర్యాటకులను, భక్తులను ఎంతగానో అలరిస్తుంటాయి. ఈ ఏడాది కూడా ఆయన రూపొందించిన ఈ కళాఖండం ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రథయాత్రను పురస్కరించుకుని యంత్రాంగం ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. లక్షలాది మంది భక్తులు పురీ నగరానికి తరలిరావడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఇది కూడా చదవండి: పూరీ రథయాత్ర: రాష్ట్రపతి ముర్ము, ‍ప్రధాని మోదీ శుభాకాంక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement