Puri Rath Yatra 2025: వస్తున్నాయ్‌..జగన్నాథ రథచక్రాల్‌ | Puri Rath Yatra 2025: Chariot all preparations nears to complete | Sakshi
Sakshi News home page

Puri Rath Yatra 2025: వస్తున్నాయ్‌..జగన్నాథ రథచక్రాల్‌

Jun 18 2025 2:40 PM | Updated on Jun 18 2025 3:00 PM

Puri Rath Yatra 2025: Chariot all preparations nears to complete

భువనేశ్వర్‌: ఈ ఏడాది జరగనున్న పూరీ జగన్నాథుని రథ యాత్రకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. యాత్ర సమీపిస్తుండటంతో, జగన్నాథుని రథాల నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. పూరిలోని రథ ఖాలా వద్ద శ్రీ జగన్నాథుని రథం నందిఘోష బలభద్రుని తాళ ధ్వజం, దేవీ సుభద్ర దర్ప దళనం అనే 3 రథాలు శ్రీ మందిరం శిఖరంతో సరిసమానంగా ఎదుగుతున్నట్లు అబ్బురపరుస్తున్నాయి. శ్రీ జగన్నాథ స్వామి యాత్ర తయారీ కార్మిక విభజనకు నిలువెత్తు తార్కాణం. అట్టడుగు నుంచి నిలువెత్తు వరకు రథాల తయారీ పనులు గొలసు కట్టుగా కొనసాగుతున్నాయి. రథాల తయారీ శాలలో వడ్రంగులు, చేతి వృత్తులవారు, ముఖ్యంగా మహరణ, భోయి సేవకులు సంప్రదాయ గడువు ప్రకారం కట్టుదిట్టమైన ఆచార వ్యవహారాలతో ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. 3 రథాల పనులు ఒకే క్రమంలో నిబద్ధతతో నిర్వహించడంతో ఒకే స్థాయిలో అంచెలంచెలుగా తయారీ పూర్తవుతుంది.  

ఒక్కో రథం బహుళ అంతస్తు భవనాన్ని పోలి ఉంటుంది. రథంపై భగవంతుని పీఠం పైభాగాన 3 మిద్దెలతో రథాల తయారీ నింగిని తాకే ఊపుతో ఎదుగుతుంది. ప్రతి రథం యొక్క మూడవ మరియు చివరి మిద్దె (ఒఘా భూయి) తయారీ పూర్తయ్యింది.

భద్రతకు ప్రాధాన్యత: సంప్రదాయబద్ధంగా వడ్రంగుల చేతిలో తయారు అవుతున్న 3 భారీ రథాల్లో ప్రతి అంశాన్ని అత్యంత కీలకంగా పరిగణిస్తున్నారు. శ్రీ మందిరం సింహ ద్వారం నుంచి గుండిచా మందిరం వరకు పోకరాకలు చేయాల్సిన రథాలకు చక్రాలకు మూలాధారం. వీటి పటిష్టతకు భద్రత  కల్పించే దిశలో చక్ర రక్షకులు (పొరా భొఢి) తయారీ పనులు పూర్తి కావస్తున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న దైవిక ప్రయాణానికి రథాల తయారీ సింహ భాగం పూర్తయ్యింది.

నేల నుంచి నింగికి: జతతి నాథుడు యాత్ర చేసే రథం నేల నుంచి నింగికి ఎగసినట్లు తయారవతుంది. చక్రాల నుంచి రథ శిఖరం వరకు అందం కనులు మిరమిట్లు గొలుపుతుంది. ఈ అందాన్ని ఆవిష్కరించడంలో క్లిష్టమైన కళాత్మక రంగుల మేళవింపుతో అలంకరించడంలో చిత్రకారులు హుషారుగా పని చేస్తున్నారు. రథం పార్శ్వ తోరణాల్ని (పట్టొ గుజొ)   సేవకులు సాంప్రదాయ మూలాంశాలను రూపకారులు చెక్కుతున్నారు. 

నలువైపులా అలంకృత చెక్కలు: రథం అందాల్ని ప్రతిబింబించడంలో నలు వైపుల ఆకర్షణీయమైన అలంకార చెక్క తోరణాల (ఫొటొలొ) అమరిక కీలకమైన నైపుణ్యత. రథాలపై నిలిపిన మిద్దెలు పట్టు కోల్పోకుండా దిట్టంగా ఉండేందుకు అంతర్భాగంలో వంపు తిరిగిన చెక్కల్ని (సేని) ఆధారంగా జోడిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement