jagannatha rathayatra
-
Puri Rath Yatra 2025: వస్తున్నాయ్..జగన్నాథ రథచక్రాల్
భువనేశ్వర్: ఈ ఏడాది జరగనున్న పూరీ జగన్నాథుని రథ యాత్రకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. యాత్ర సమీపిస్తుండటంతో, జగన్నాథుని రథాల నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. పూరిలోని రథ ఖాలా వద్ద శ్రీ జగన్నాథుని రథం నందిఘోష బలభద్రుని తాళ ధ్వజం, దేవీ సుభద్ర దర్ప దళనం అనే 3 రథాలు శ్రీ మందిరం శిఖరంతో సరిసమానంగా ఎదుగుతున్నట్లు అబ్బురపరుస్తున్నాయి. శ్రీ జగన్నాథ స్వామి యాత్ర తయారీ కార్మిక విభజనకు నిలువెత్తు తార్కాణం. అట్టడుగు నుంచి నిలువెత్తు వరకు రథాల తయారీ పనులు గొలసు కట్టుగా కొనసాగుతున్నాయి. రథాల తయారీ శాలలో వడ్రంగులు, చేతి వృత్తులవారు, ముఖ్యంగా మహరణ, భోయి సేవకులు సంప్రదాయ గడువు ప్రకారం కట్టుదిట్టమైన ఆచార వ్యవహారాలతో ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. 3 రథాల పనులు ఒకే క్రమంలో నిబద్ధతతో నిర్వహించడంతో ఒకే స్థాయిలో అంచెలంచెలుగా తయారీ పూర్తవుతుంది. ఒక్కో రథం బహుళ అంతస్తు భవనాన్ని పోలి ఉంటుంది. రథంపై భగవంతుని పీఠం పైభాగాన 3 మిద్దెలతో రథాల తయారీ నింగిని తాకే ఊపుతో ఎదుగుతుంది. ప్రతి రథం యొక్క మూడవ మరియు చివరి మిద్దె (ఒఘా భూయి) తయారీ పూర్తయ్యింది.భద్రతకు ప్రాధాన్యత: సంప్రదాయబద్ధంగా వడ్రంగుల చేతిలో తయారు అవుతున్న 3 భారీ రథాల్లో ప్రతి అంశాన్ని అత్యంత కీలకంగా పరిగణిస్తున్నారు. శ్రీ మందిరం సింహ ద్వారం నుంచి గుండిచా మందిరం వరకు పోకరాకలు చేయాల్సిన రథాలకు చక్రాలకు మూలాధారం. వీటి పటిష్టతకు భద్రత కల్పించే దిశలో చక్ర రక్షకులు (పొరా భొఢి) తయారీ పనులు పూర్తి కావస్తున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న దైవిక ప్రయాణానికి రథాల తయారీ సింహ భాగం పూర్తయ్యింది.నేల నుంచి నింగికి: జతతి నాథుడు యాత్ర చేసే రథం నేల నుంచి నింగికి ఎగసినట్లు తయారవతుంది. చక్రాల నుంచి రథ శిఖరం వరకు అందం కనులు మిరమిట్లు గొలుపుతుంది. ఈ అందాన్ని ఆవిష్కరించడంలో క్లిష్టమైన కళాత్మక రంగుల మేళవింపుతో అలంకరించడంలో చిత్రకారులు హుషారుగా పని చేస్తున్నారు. రథం పార్శ్వ తోరణాల్ని (పట్టొ గుజొ) సేవకులు సాంప్రదాయ మూలాంశాలను రూపకారులు చెక్కుతున్నారు. నలువైపులా అలంకృత చెక్కలు: రథం అందాల్ని ప్రతిబింబించడంలో నలు వైపుల ఆకర్షణీయమైన అలంకార చెక్క తోరణాల (ఫొటొలొ) అమరిక కీలకమైన నైపుణ్యత. రథాలపై నిలిపిన మిద్దెలు పట్టు కోల్పోకుండా దిట్టంగా ఉండేందుకు అంతర్భాగంలో వంపు తిరిగిన చెక్కల్ని (సేని) ఆధారంగా జోడిస్తున్నారు. -
శోభాయమానం..జగన్నాథ రథయాత్ర
కర్నూలు (న్యూసిటీ): జగన్నాథ రథయాత్ర కర్నూలు నగరంలో శనివారం శోభాయమానంగా సాగింది. స్థానిక మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి.. పాతబస్టాండ్, పెద్దపార్క్, రాజ్విహార్ మీదుగా..బంగారుపేట, ఆర్ఎస్ రోడ్డు నుంచి తిరిగి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేరింది. హరే రామ..హరే కృష్ణ సంకీర్తనలు, భజనలు, కోలాటాలతో రథయాత్ర రమణీయంగా జరిగింది. నంద్యాల విద్యార్థుల హరినామ సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. రథయాత్ర ప్రారంభ కార్యక్రమంలో ఎస్పీ ఆకె రవికృష్ణ మాట్లాడారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రథయాత్ర మహోత్సవాలు యువకుల్లో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించాయన్నారు. రథయాత్ర ప్రారంభోత్సవంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జగన్నాథునికి ఊంజల సేవ
కర్నూలు(న్యూసిటీ): శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా బుధవారం రాధాసమేత శ్రీకృష్ణ భగవానునికి ఊంజల సేవ నిర్వహించారు. కర్నూలులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ముందుగా బలదేవి, సుభద్రదేవి సమేత జగన్నా«థస్వామికి అష్టోత్తర శతనామావళి మంత్రాలను పఠించారు. హారితిచ్చిన అనంతరం హరేకృష్ణ మహా మంత్ర జపం చేశారు. ఇస్కాన్ నరసరావుపేట ఇన్చార్జ్ వైష్ణవ ప్రభుదాస్.. భాగవత ప్రవచాలను బోధించారు. అమ్మవార్లకు స్వామికి ఊంజల సేవ జరిపారు. ఇస్కాన్ కర్నూలు ప్రాజెక్టు డైరెక్టర్ రూపేశ్వర్ చైతన్యదాస్, కర్నూలు ఇన్చార్జ్ చైతన్య చంద్ర ప్రతిదాస్ పాల్గొన్నారు. 7న రథయాత్ర: జగన్నాథస్వామి రథయాత్రను ఈ నెల 7వ తేదీన జరుపుతామని ఇస్కాన్ కర్నూలు ఇన్చార్జ్ చైతన్య చంద్ర ప్రతిదాస్ తెలిపారు. రథయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.