
సాక్షి, విశాఖపట్నం: ఏపీకి భారత వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే వారం రోజులు వాతావరణం అల్లకల్లోలంగా ఉంటుందని చెబుతూ.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన చేసింది. అదే సమయంలో దక్షిణ కోస్తాలోనూ విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది.
ఉత్తర ఒడిశాను అనుకుని ఉన్న బంగాళాతంలో ఉపరితల ఆవర్తనం బలంగా కొనసాగుతోంది. రుతుపవనాల పురోగతికి మారిన వాతావరణం అనుకూలంగా మారింది. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్ పూర్ వరకు నైరుతి విస్తరించి ఉంది.
తీరం వెంబడి ఇప్పటికే గరిష్టంగా 40కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఆవర్తన ప్రభావంతో పాతపట్నంలో 5, పార్వతీపురంలో 5 ,టెక్కలి.. సాలూరు.. శ్రీకాకుళం.. ఆనందపురంలో 4, విజయనగరం, కళింగపట్నం. అనకాపల్లిలో 3 సెంమీ చొప్పున వర్షపాతం నమోదు అయ్యింది.