భగ్గుమన్న విద్యార్థులు | Rallies in support of youth protests in Delhi | Sakshi
Sakshi News home page

భగ్గుమన్న విద్యార్థులు

Jul 25 2026 4:01 AM | Updated on Jul 25 2026 4:01 AM

Rallies in support of youth protests in Delhi

ఢిల్లీలో యువత దీక్షలకు మద్దతుగా ర్యాలీలు 

మూతపడ్డ ప్రైవేట్‌ విద్యా సంస్థలు

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: ‘నీట్‌’ నిర్వహణలో ప్రభు­త్వ వైఫల్యంపై నిరసన ర్యాలీలు.. ఎన్‌టీఏ రద్దు... ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద యువత దీక్షలకు మద్దతుగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాలు నిర్వ­హించిన విద్యాసంస్థల బంద్‌ ప్రశాంతంగా జరిగింది. ప్రైవే­ట్‌ విద్యాసంస్థలు, ఇంజనీరింగ్, ఐటీఐ తదితర వృత్తి­వి­ద్యా కళాశాలలు దాదాపుగా మూతపడ్డాయి. విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ పిలుపుతో స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. కేంద్ర మానవ వనరుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశా­యి. 

నీట్‌ లీకేజ్‌తో దేశంలో సుమారు 24 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డాయి. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఫార్మసీ పరీక్షలను నిలిపివేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని యూనియన్‌ నాయ­కులను బందరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఒంగోలు కలె­క్టరేట్‌ వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘా­ల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, రాజానగరంలో విద్యార్థులు ధర్నాలు చేపట్టారు. పలుచోట్ల ద్విచక్ర ర్యాలీలు నిర్వహించారు.

అనంతపురంలోని కేఎస్‌ఆర్‌ ప్రభుత్వ బాలికల పాఠశాల వద్ద విద్యార్థి, యువజన సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పుట్టపర్తి­లోని గణేష్‌ కూడలిలో ఉరితాడుతో నిరసన తెలిపి దున్నపోతుకు వినతిపత్రం అందజేశారు. కడపలో పాఠశాలల వద్ద విద్యార్థి సంఘాలకు, పోలీసులకు మధ్య తోపులాట జరి­గింది. పత్తికొండలో పీటీఎం సమావేశాలను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. కాగా, విద్యా­ర్థుల న్యాయమైన పోరాటంపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ నిందలు వేసి తప్పుడు ఆరోపణలు చేయడాన్ని విద్యార్థి, యువజన సంఘాలు తీవ్రంగా ఖండించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement