నీట్‌లో సత్తా చాటిన కూలీ, చిరువ్యాపారి, రైతుల కూతుళ్లు..! | Daughters Of Laborers And Farmers In Uttar Pradesh Cracking NEET, Know Their Story Inside | Sakshi
Sakshi News home page

నీట్‌లో సత్తా చాటిన కూలీ, చిరువ్యాపారి, రైతుల కూతుళ్లు..!

Jun 18 2025 5:07 PM | Updated on Jun 18 2025 5:52 PM

Daughters of laborers and farmers in Uttar Pradesh cracking NEET

ఆర్థికంగా వెనకబడిని వారికి ఉన్నత చదువులు అందని ద్రాక్షలాంటివే. చదవగలిగే ప్రతిభ ఉన్న..అందుకు తగిన ఆర్థిక సాయం, ప్రోత్సాహం కరువైతే..వారి ప్రతిభ అడుగంటిపోతుంది. పైగా దేశం గొప్ప మేధావులను కోల్పోతుంది ​కూడా. ఆ ఉద్దేశ్యంతో వెనుబడిన వర్గాల కోసం ప్రభుత్వం రెసిడెన్షియల్‌ స్కూళ్ల రూపంలో చదువుకునే అవకాశాన్ని అందిస్తోంది. అలా ప్రభుత్వం అందించే అవకాశాలను వినియోగించుకుని ఈ మూగ్గురు అమ్మాయిలు ప్రతిష్టాత్మకమైన నీట్‌ పరీక్షల్లో సత్తా చాటారు. అంతేగాదు సర్కారు చదువు సత్తా ఏంటో తెలిసేలా చేశారు. 

యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. అక్కడ మారిహాన్ గ్రామంలోని ప్రభుత్వ సర్వోదయ విద్యాలయానికి చెందిన మొత్తం 12 మంది బాలికలు వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. హాజరైన బాలికల్లో దాదాపు సగానికి పైగా అందరు వెనుకబడిన వర్గాలకు చెందినవారే. యూపీ సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాల ఘనత ఇది. 

ఆర్థికంగా వెనుకబడిన పిల్లల కోసం ఏర్పాటైన సర్వోదయలో బాలికలు ఉచిత రెసిడెన్షియల్ పాఠశాలలో వారంత ఆరు నుంచి 12 తరగతులు వరకు చదువుకుంటారు. అక్కడే రెడిడెన్షియల్‌ స్కూల్‌లో ఈ ఏడాది జేఈఈ, నీట్‌ వంటి పరీక్షలకు కోచింగ్‌ కూడా పోందారుద. వారిలో వ్యవసాయ కూలీ కూతురు ప్రిన్సీ, రైతు కూతురు పూజ రంజన్‌, సైకిల్‌ సీట్‌ కవర్లు అమ్మే దుకాణందారుడు కూతురు కౌశాంబి శ్వేత ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 

వారి వచ్చిన నేపథ్యం దృష్ట్యా డాక్టర్‌ కావలనే కోరిక మసకబారిపోతుందనే అనుకున్నారు. అందులోనూ ప్రభుత్వ పాఠశాల చదవే తాము ఈ నీట్‌ ఎగ్జామ్‌ లాంటి వాటి కోసం కోచింగ్‌ తీసుకునే ఛాన్సే లేదు. కాబట్టి డాక్టర్‌ కావడం అనేది ఓ కలేనేమో అనుకున్నారు ఆ అమ్మాయిలు. వారి అదృష్టమో లేక వరమో గానీ నవోదయ పూర్వ విద్యార్థుల నెట్‌ వర్క్‌ అయిన టాటా AIG, మాజీ నవోదయ ఫౌండేషన్‌ మద్దతుతో వారు ఉంటున్న మారిహాన్‌ గ్రామంలోనే నీట్‌ కోచింగ్‌ 2024 చిన్నగా ప్రారంభమైంది. 

అది వారికి వరమైన ఆ ఎగ్జామ్‌కి ప్రిపేరయ్యిందుకు తోడ్పడింది. ఆ చిన్న ప్రోత్సాహాన్ని ఉపయోగించుకుని ఈ ఎగ్జామ్‌లో ఈ ముగ్గురు అమ్మాయిలు ఉత్తీర్ణులై తమ కలను సాకారం చేసుకున్నారు. ఆ స్వచ్ఛంధ సంస్థలో సుమారు 39 అడ్మిషన్‌ పోందగా వారిలో 25 మంది నీట్‌కి, మిగతా 14 మంది జేఈఈకి ప్రిపేరయ్యారు. 

అయితే ఆ నీట్‌ ఎగ్జామ్‌కి హాజరైన 25 మందిలో 12 మంది ఉత్తీర్ణులు కావడం విశేషం. దీన్ని మిగతా సర్వోదయ విద్యాలయాల్లో కూడా అందించి.. వెనుబడిన వర్గాల పిల్లలందరూ ఇలాంటి ఉన్నత చదవులు చదువుకుని తమ కలను సాకారం చేసుకునేలా చేయడమే తమ ధ్యేయం అని మారిహాన్‌ సాంఘిక సంక్షేమ డైరెక్టర్ కుమార్ ప్రశాంత్ అన్నారు.   

(చదవండి:  అమ్మాయిలూ.. బహుపరాక్‌!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement