పెట్రోల్‌బంక్‌ నిర్మాణానికి స్థల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌బంక్‌ నిర్మాణానికి స్థల పరిశీలన

Jun 18 2025 3:41 AM | Updated on Jun 18 2025 3:41 AM

పెట్ర

పెట్రోల్‌బంక్‌ నిర్మాణానికి స్థల పరిశీలన

రఘునాథపల్లి: రఘునాథపల్లి మండల కేంద్రంలోని ఖిలాషాపూర్‌ రోడ్డులో స్వయం కృషి దివ్యాంగుల మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పెట్రోల్‌బంక్‌ నిర్మాణానికి మంగళవారం కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా స్థలాన్ని పరిశీలించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిణి వసంత, అడిషనల్‌ డీఆర్‌డీఓ నూరుద్దిన్‌, తహసీల్దార్‌ మోహ్సిన్‌ముజ్తబ, డీపీఎం రాజేంద్రప్రసాద్‌లతో కలిసి కలెక్టర్‌ స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 12 గుంటల స్థలంలో పెట్రోల్‌ బంకు నిర్మాణానికి భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) నుంచి అనుమతి లభించిందన్నారు. సుమారు రూ.70 లక్షలతో నిర్మించనున్న ఈ పెట్రోల్‌ బంక్‌ నిర్మాణంతో దివ్యాంగుల మండల సమాఖ్య అభివృద్ధి పథంలో కొనసాగనుందన్నారు. ఆయన వెంట ఏపీఎం సారయ్య, సీసీలు జంపయ్య, రేణుక, లలిత తదితరులు ఉన్నారు.

పాఠశాల ఆకస్మిక తనిఖీ

జనగామ: పట్టణంలోని రైల్వే స్టేషన్‌ ఏరియా ప్రభుత్వ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 6 నుంచి 10 తరగతుల విద్యార్థుల అభ్యసన సామర్‌ాధ్యలను పరిశీలించారు. విద్యార్థుల ప్రతిభను చూసిన డీఈఓ వారిని అభినందించి, కష్టపడి చదువుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను విద్యార్థులకు అందించారనే అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సర్కారు అందిస్తున్న సంక్షేమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం వి.కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు ఉన్నారు.

భూగర్భ జలాలను

పెంచుకోవాలి

నర్మెట/బచ్చన్నపేట: భూగర్భ జలాల పెంపునకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కేంద్ర జలశక్తి అభియాన్‌ శాస్త్రవేత్త వెంకటగిరి అన్నారు. మంగళవారం నర్మెట, బచ్చన్నపేట మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. ప్రతి ఇంట్లోని నీరు వృథాగా పోకుండా ఇంకుడుగుంతను నిర్మించుకోవాలన్నారు. సంబంధిత ఈజీఎస్‌ అధికారులు గ్రామాల్లో ఇంకుడు గుంతలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓలు బోడపాటి అరవింద్‌ చౌదరి, వెంకటమల్లికార్జున్‌, ఏపీఓలు కృష్ణ, పులుగం రమాదేవి, టీఏ బాబు, కార్యదర్శులు శ్రీధర్‌, గణేష్‌, నరేష్‌, సుజాత, తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ అధికారుల నూతన ఫోన్‌నంబర్లు

జనగామ: జనగామ డివిజన్‌ పరిధిలోని విద్యుత్‌ శాఖ ఇంజినీర్ల ఫోన్‌ నంబర్లు మారినట్లు డీఈ ఎం.లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ పాత నంబర్ల స్థానంలో కొత్త సిమ్‌ కార్డులను ఇవ్వడం జరిగిందని, ఈ నంబర్లను ప్రతీ వినియోగదారుడు తెలుసుకుని సేవలను పొందాలన్నారు.

హోదా ఫోన్‌నంబర్‌

ఎస్‌ఈ,జనగామ 87124 82677

డీఈ 87124 82682

ఏడీఈ 87124 82693

ఏఈ,జనగామ టౌన్‌–1 87124 82718

ఏఈ,జనగామ టౌన్‌–2 87124 82719

ఏఈ,జనగామ రూరల్‌ 87124 82720

ఏఈ,పెంబర్తి 87124 82721

ఏఈ,బచ్చన్నపేట 87124 82722

ఏఈ,పడమటికేశ్వార్‌ 87124 82723

ఏడీఈ,దేవరుప్పుల 87124 82695

ఏఈ,దేవరుప్పుల 87124 82724

ఏఈ,సింగరాజుపల్లి 87124 82725

ఏఈ,లింగాలఘణపూర్‌ 87124 82726

ఏడీఈ,రఘునాథపల్లి 87124 82694

ఏఈ,రఘునాథపల్లి 87124 82728

ఏఈ,ఖిలాషాపూర్‌ 87124 82729

ఏఈ,నర్మెట 87124 82730

ఏఈ,తరిగొప్పుల 87124 82731

పెట్రోల్‌బంక్‌ నిర్మాణానికి స్థల పరిశీలన
1
1/2

పెట్రోల్‌బంక్‌ నిర్మాణానికి స్థల పరిశీలన

పెట్రోల్‌బంక్‌ నిర్మాణానికి స్థల పరిశీలన
2
2/2

పెట్రోల్‌బంక్‌ నిర్మాణానికి స్థల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement