
త్వరలో ిసీటీ స్కాన్ సేవలు!
జనగామ: జనగామ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (డీహెచ్)లో సీటీస్కాన్ సేవలను మరో పది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ీసీటీ స్కాన్ యంత్రం డీహెచ్కు చేరుకుని నెలలు కావస్తుంది. యంత్రం ఇన్స్స్టాలేషన్కు సంబంధించి ఏజెన్సీ జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సి ంహ్మ మంగళవారం కలెక్టర్ రిజ్వాన్ బాషాకు ఫోన్ చేసి ఆరా తీశారు. సీటీ స్కాన్ సేవలను త్వరగా ప్రాంభించాలని ఆదేశించారు. జిల్లా ఆస్పత్రిలో ఓల్డ్ సీటీ స్కాన్ గదిలోనే కొత్త యంత్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి పాత మిషన్ను తొలగించి, కొత్తగా ఏర్పాటు కోసం గదిలో మరమ్మతు పనులు చేపట్టారు. ఈ నెల 27వ తేదీలోపు ీసీటీస్కాన్ సేవలను ప్రారంభించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్రావు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో ీసీటీ స్కాన్ సేవలు మూలన పడి 8 ఏళ్లు గడిచి పోతున్నా, పాత వాటి స్థానంలో కొత్త సేవల ప్రారంభంలో జాప్యం పై ‘సాక్షి’ లో అనేక కథనాలు ప్రచురితం చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. ీసీటీస్కాన్ యంత్రం కొనుగోలుకు ఆదేశాలు జారీ చేయగా, ప్రస్తుతం ఇన్స్స్టాలేషన్ దశలో ఉంది. సాక్షి కృషితో కొద్ది రోజుల్లో పేదలకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.