
ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామనా హామీ ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక నాలుక మడతెట్టేశారు.

తొలి ఏడాది ఎగనామం పెట్టిన ప్రభుత్వం తాజాగా పలు నిబంధనలతో తల్లికి వందనం నిధులు విడుదలజేసింది. అయితే ఇందులో నిబంధనలు చాలా మంది విద్యార్థుల తల్లులను కష్టాలపాలు చేసింది.

ఈకేవైసీ కోసం కొంత మంది..మరి కొంత మంది పోస్టల్ కార్యాలయాల్లో ఖాతాలు తెరిచేందుకు గంటల తరబడి క్యూల్లో నిల్చొని అవస్థలు పడుతున్నారు.

వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఈకేవైసీ కానీ, ఇతర దరఖాస్తులకు ఇంటి వద్దకే వలంటీరు అన్నీ వచ్చి చేసి వెళ్లే వాడు.

పోస్టల్ కార్యాలయం దగ్గర క్యూల్లో నిల్చున్న జనం వైఎస్సార్ సీపీ పాలనను గుర్తుకు తెచ్చుకుంటున్నారు.








