
క్షయ నిర్ధారణ పరీక్షలు పెంచాలి
రఘునాథపల్లి: క్షయ నిర్ధారణ పరీక్షలు పెంచాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కె.మల్లికార్జునరావు వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వంద రోజుల టీబీ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక క్షయ వైద్య శిబిరంలో ఆయన మాట్లాడారు. టీబీ నిర్ధారణ కోసం వచ్చిన వారితో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మొబైల్ యాక్టివ్ కేస్ ఫైండింగ్ యూనిట్, సీవై టీబీ పరీక్షలను పర్యవేక్షించారు. సిబ్బందికి పలు సూచనలిచ్చారు. వైద్య శిబిరంలో పాల్గొన్న 155 మంది టీబీ అనుమానితులకు ఎక్స్రే, సీబీ నాట్ పరీక్ష, సైడ్ టీబీ స్క్రీన్ టెస్ట్ నిర్వహించారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు అశోక్, కమల్హాసన్, పీహెచ్సీ వైద్యాధికారి స్రవంతి, సీహెచ్ఓ రామ్కిషన్, జిల్లా క్షయ నిర్ధారణ బృంద సభ్యులు చంద్రారెడ్డి, విశ్వనాథ్, మధు, అంజుకుమార్, శ్రవణ్కుమార్, సూపర్వైజర్లు సుజన, రజనీ, సులోచన తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి మల్లికార్జునరావు