
చవక ధరలకు నాణ్యమైన మందులు
● డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు
పాలకుర్తి టౌన్: చవక ధరలకు నాణ్యమైన మందులు ప్రధాన మంత్రి జాతీయ జన్ ఔషధి కేంద్రంలో పొందవచ్చని జిల్లా వైద్యాధికారి కె.మల్లికార్జున్రావు అన్నారు. మండల కేంద్రంలో జాతీయ జన్ ఔషధి కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శంచిన ఆయన వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఎచ్ఓ డాక్టర్ సుధీర్, డీఐఓ డాక్టర్ స్వర్ణకుమారి, పీహెచ్సీ వైద్యాధికారి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు.