నిజరూప దర్శనం | - | Sakshi
Sakshi News home page

నిజరూప దర్శనం

Jun 14 2025 7:43 AM | Updated on Jun 14 2025 7:43 AM

నిజరూప దర్శనం

నిజరూప దర్శనం

చిల్పూరు: శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి శుక్రవారం భక్తులకు నిజరూప అలంకరణలో దర్శనంఇచ్చారు. ఉదయం ఆలయ ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్‌ శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు.

ఆయిల్‌ పామ్‌ సాగు

లాభదాయకం

నర్మెట: ఆయిల్‌ పామ్‌ తోటలతో రైతులకు అధిక లాభాలుంటాయి.. అంతర పటలకు అనుకూలమని ఆయిల్‌ ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ శంకర్‌ అన్నారు. స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన రైతు అవగా హన సదస్సులో ఆయన మాట్లాడారు. ఒక్కసారి నాటితే 30 ఏళ్ల వరకు ఆదాయం పొందవచ్చని, చీడపీడలు, కోతులతో నష్టం ఉండదని పేర్కొన్నారు. బిందు సేద్యం ద్వారా 50 శాతం ఎరువులు, సాగు ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు. ప్రభుత్వం నిర్వహణ వ్యయంగా ఎకరాకు రూ.4,500 ఆర్థిక సహాయం అందజేస్తున్నదని, బిందు సేద్యం పరికరాలను ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో ఎఫ్‌ఓ హరిబాబు, పీఎంఓ రాజేందర్‌, డ్రిప్‌ కంపెనీ ప్రతినిథులు, రైతులు పాతూరి మల్లారెడ్డి, దేవులపల్లి రాంరెడ్డి, ముప్పిడి భూమయ్య, కొన్నె భిక్షపతి, నిమ్మ కృష్ణారెడ్డి, ఐలేని సిద్దిరామిరెడ్డి, వెంకట్రామి రెడ్డి, గౌరబోయిన యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ కుంటలో ఔషధ మొక్కలు

జనగామ: పట్టణంలోని బతుకమ్మకుంటలో ఔషధ మొక్కలు నాటేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయుష్‌ విభాగం ప్రతినిధులు శుక్రవారం కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషాకు వినతిపత్రం అందజేశారు. మెడికల్‌ ప్లాంట్స్‌ గురించి వివరించి సింధూరి మొక్క అందజేశారు. ఈ సందర్భంగా బతుకమ్మ కుంట చుట్టూ ఔషధ మొక్కలు నాటేందుకు కలెక్టర్‌ అనుమతించారు. కార్యక్రమంలో విశ్వ ఆయుర్వేద పరిషత్‌ నుంచి డాక్టర్‌ సురేష్‌, డాక్టర్లు అంజిరెడ్డి, అనురాధ, మమత, హారిక, ప్రీతి తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎం గోదాం పరిశీలన

జనగామ రూరల్‌: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్‌ కార్యాలయంలోని ఈవీఎం గోదాంను శుక్రవారం కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా సందర్శించారు. భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పనితీరు, మంటల నియంత్రణ పద్ధతులను పరిశీలించారు. ఈవీఎం వీవీ ప్యాట్లు, బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్ల నిర్వహణలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాల ని, భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట వివిధ పార్టీల నాయకులు భాస్కర్‌, రవి, విజయభాస్కర్‌, జోగు ప్రకాశ్‌ తదితరులు ఉన్నారు.

24 గంటల ధర్నాను జయప్రదం చేయండి

జనగామ రూరల్‌: పట్టణంలోని మూడో విడత ఇందిరమ్మ ఇళ్లకు ఇంటి నంబర్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యాన ఈనెల 16న కలెక్టరేట్‌ ఎదుట తలపెట్టిన 24 గంటల ధర్నాను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కార్యాలయంలో మూడో విడత ఇందరమ్మ ఇళ్ల సాధన కమిటీ అధ్యక్షు డు కళ్యాణం లింగం ఆధ్వర్యాన ఏర్పాటు చేసి న సమావేశంలో వారు మాట్లాడారు. ఇళ్లు నిర్మించుకొని అక్కడే నివాసం ఉంటున్న లబ్ధిదారులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఇంటి నంబర్లు, విద్యుత్‌, రోడ్డు, డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బోట్ల శ్రావణ్‌, పగిడిపల్లి బాలమణి, కొమ్మగళ్ల ఎల్లయ్య, ముసిపట్ల జయ, భూనాద్రి వెంకటేశ్‌, మాదాసి సుధాకర్‌, బాలస్వామి, మేడ పద్మ, కొడిదాల అంజమ్మ, గుండు శశిరేఖ, సంతోష తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement