
బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి
● సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
జనగామ రూరల్: జాతీయ రహదారి జనగామ నుంచి దుద్దెడ వరకు నిర్మిస్తున్న 365బి నిర్మాణంలో ఇళ్ల స్థలాలు కోల్పోతున్న యజమానులకు గజానికి రూ.20వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆర్డీఓ గోపిరామ్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల పేరుతో చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణంలో స్థలాలు కోల్పోతున్న బాధితుల విషయంలో ప్రభుత్వాలు, అధికారులు మానవీయ కోణంలో ఆలోచించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్హెచ్ బాధిత ప్లాట్ ఓనర్ల కమిటీ అధ్యక్షుడు బూడిది గోపి, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గద్దల కిషోర్, కోశాధికారి గూడెల్లి కృష్ణారెడ్డి, గౌరవ సలహాదారు కర్రే కృష్ణ, నల్ల యాదగిరి, గంగుల భూపాల్రెడ్డి, గుండు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.