
ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025
జఫర్గఢ్: కన్నపిల్లలు కాకున్నా.. వందలాది మంది పిల్లలతో నాన్న అని పిలుపించుకుంటున్నారు ‘మా ఇల్లు’ అనాథ ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నయ్య. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీ తండా వద్ద ఉన్న ‘మా ఇల్లు ప్రజాదరణ అనాథ ఆశ్రమం’లో రెండు దశాబ్దాలుగా ఎంతో మంది అనాథలను అక్కున చేర్చుకుని ఆశ్రమంలో చోటు కల్పించారు. వారికి అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు గాదె ఇన్నయ్య. అనాథ పిల్లల పట్ల తండ్రి ప్రేమను పంచుతూ.. పిల్లల అభిమానాన్ని పొందుతున్నారు. ఆశ్రమంలోని పిల్లలు తమ ఆధార్ కార్డుల్లో, పాఠశాలల రికార్డుల్లో సైతం ఇన్నయ్య పేరునే తమ తండ్రిగా రాయించడం విశేషం. ఈసందర్భంగా గాదె ఇన్నయ్య మాట్లాడుతూ.. ఎంతో మంది అనాథ పిల్లలతో నాన్న అని పిలిపించుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. పిల్లలు కూడా తనను తండ్రిలాగే భావిస్తూ తనపై అభిమానం చూపుతున్నట్లు పేర్కొన్నారు. పిల్లలు కూడా ఆశ్రమంలో ఇన్నయ్యను నాన్న అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటారు ఇలా.. పిలవడమే తమకిష్టం అని పిల్లలు చెబుతున్నారు. ‘తండ్రి లేని లోటును తీరుస్తున్న ఇన్నయ్యే మా నాన్న’ అంటూ వారు పేర్కొనడం గమనార్హం.
ఏళ్ల కష్టానికి.. విజయమే సమాధానం!
బచ్చన్నపేట: భూమిని నమ్ముకుని కుటుంబాన్ని పోషించారు. చదువును నమ్ముకుని పిల్లలను బాగా చదివించారు. ఆ తండ్రి ఇప్పుడు గర్వంగా చెబుతున్నాడు తమ పిల్లలు ప్రయోజకులయ్యారని. బచ్చన్నపేటకు చెందిన చిమ్ముల మల్లారెడ్డికి ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. సేద్యం చేస్తూ ఇద్దరు పిల్లల్ని చదివించాడు. పాడి పశువుల్ని సాకుతూ పాలు పితికి అమ్ముతూ, వ్యవసాయం చేస్తూ ఒక కొడుకు, ఒక కూతురును ఉన్నతంగా చదివించారు. కూతురు చిమ్ముల నవిత ప్రస్తుతం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా జనగామ మండలం పెద్దపహాడ్లో విధులు నిర్వరిస్తున్నారు. కుమారుడు రాజశేఖర్రెడ్డి గ్రూప్–1లో స్టేట్ 272వ ర్యాంకు సాధించారు. ‘నా కలలు నిజమయ్యాయి. పిల్లలు ప్రయోజకులవ్వడం చూస్తే ఇన్నేళ్ల కష్టం మరిచిపోతున్నా’ అంటున్నారు చిమ్ముల మల్లారెడ్డి.
న్యూస్రీల్
వందలాది పిల్లలకు దేవుడిచ్చిన నాన్న

ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025