అదనపు కోర్టు మంజూరు చేయాలి | - | Sakshi
Sakshi News home page

అదనపు కోర్టు మంజూరు చేయాలి

Jun 14 2025 7:43 AM | Updated on Jun 14 2025 7:43 AM

అదనపు కోర్టు మంజూరు చేయాలి

అదనపు కోర్టు మంజూరు చేయాలి

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఘన్‌పూర్‌ డివిజన్‌ కేంద్రంలో అదనపు కోర్టు మంజూరు చేయాలని స్థానిక బార్‌ అసోసియేషన్‌ బాధ్యులు జిల్లా జడ్జి ప్రతిమను కోరారు. జడ్జి శుక్రవారం స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టును సందర్శించారు. కోర్టు పరిసరాలను పరిశీలించిన ఆమె కోర్టు ఫైలింగ్‌ కేసులు తదితర వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఘన్‌పూర్‌ కోర్టు పరిధిలోని కేసుల గురించి ఘన్‌పూర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కనకం రమేశ్‌ జడ్జికి వివరించారు. కోర్టు పరిధిలో 3,600 కేసులు ఉన్నాయని, హైకోర్టు నిబంధనల మేరకు అదనపు కోర్టు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఘన్‌పూర్‌ జడ్జి సందీప తదితరులు పాల్గొన్నారు.

జిల్లా జడ్జికి ఘన్‌పూర్‌

బార్‌ అసోసియేషన్‌ బాధ్యుల వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement