
పనులు సత్వరమే పూర్తి చేయండి
రఘునాథపల్లి: అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పింకేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని నిడిగొండ, కంచనపల్లి పాఠశాలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి భోజయ్య, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, పీఆర్ ఏఈ భరత్, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ప్రశంస పత్రాల పంపిణీ
జనగామ రూరల్: కార్పొరేట్ కళాశాల విద్యను విద్యార్థులు వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ పింకేశ్కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించి ఇంటర్లో కార్పొరేట్ కళాశాలలో చేరుతున్న 15 మంది విద్యార్థులకు ప్రవేశపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ, మైనార్టీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులు డాక్టర్ విక్రమ్, రవీందర్ సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
‘బడిబాట’పై పాట
ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత, నాణ్యమైన విద్య, విద్యా ప్రాముఖ్యాన్ని కళ్లకు కట్టినట్లుగా అల్లూరి రవీందర్ రాసిన, వసంత, జ్యోతి, యమున టీచర్లు గానం చేసిన బడి బాట పాట వీడియోను కలెక్టర్ రిజ్వానా భాషా, డీఈఓ భోజన్న మండలంలోని ఎర్రకుంట తండా పాఠశాలలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల నమోదుకు చేస్తున్న కృషిని కలెక్టర్ అభినందించారు.

పనులు సత్వరమే పూర్తి చేయండి