బడి.. విద్యార్థుల సందడి | - | Sakshi
Sakshi News home page

బడి.. విద్యార్థుల సందడి

Jun 13 2025 5:25 AM | Updated on Jun 13 2025 5:25 AM

బడి..

బడి.. విద్యార్థుల సందడి

శుక్రవారం శ్రీ 13 శ్రీ జూన్‌ శ్రీ 2025

8లోu

జనగామ: సర్కారు బడుల పునఃప్రారంభం పండుగ వాతావరణాన్ని తలపించింది. అరటి, మామిడి కొమ్మలు, తీరొక్క పూలతో బడుల ప్రాంగణాలను అలంకరించి, చదువుల తల్లి సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు చేశారు. వేసవి సెలవులను ముగించుకుని స్కూల్‌ బాట పట్టిన విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. యూనిఫాంలో కొందరు, కొత్త బట్టలు ధరించి మరి కొందరు విద్యార్థులు బడికి వచ్చారు. విద్యార్థుల చేతిలో పూలు పెట్టి ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు స్వాగతం పలికారు. యాభై రోజుల పాటు ఆడి, పాడుతూ ఎంజాయ్‌ చేసిన పిల్లలు, నూతన విద్యా సంసవత్సరంలో భుజాన బ్యాగు వేసుకున్నారు. మొదటి రోజు తల్లిందడ్రులతో కలిసి పాఠశాలకు వచ్చిన విద్యార్థులు పై తరగతిలో కూర్చొని సంతోషపడ్డారు. జనగామ మండలం ఎర్రగుండ తండా పీఎస్‌ను కలెక్టర్‌ పునఃప్రారంభించారు.

నూతన విద్యార్థులు 2,428

జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, గురుకుల పాఠశాలలు 548 ఉన్నాయి. వీటి పరిధిలో 45 వేలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా ఆదేశాల మేరకు డీఈఓ భోజన్న పర్యవేక్షణలో టీచర్లు బడిబాట నిర్వహించారు. దీంతో విద్యార్థుల సంఖ్యను కొంతమేర పెంచగలిగారు. అన్ని కేటగిరీల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 1,607, కేజీబీవీ (6 నుంచి12 వర కు) 821 మొత్తం 2,428 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందారు. ఇంకా పెరిగే అవకాశం ఉంది.

తొమ్మిది జీరో స్కూళ్లు పునఃప్రారంభం

జిల్లాలో 72 ప్రాథమిక, ఒక యూపీఎస్‌ మొత్తం 73 పాఠశాలల్లో జీరో స్ట్రెంత్‌తో రెండేళ్ల క్రితం మూసేశారు. గతంలో మూతబడిన పాఠశాలల్లో బచ్చన్నపేట మండలం బసిరెడ్డిపల్లి, జయాల, చిల్పూరు మండలం గార్లగడ్డ తండా, దేవరుప్పుల మండలం మల్యతండా, రాజీవ్‌ కాలనీ, జనగామ మండలం ఎర్ర గుంటతండా, కొడకండ్ల మండలం బోడ తండా, నర్మెట మండలం లుంబియా తండా, పాలకుర్తి మండలం కురుమ తండా పరిధిలో తిరిగి పునఃప్రారంభించారు. తొమ్మిది గ్రామాల్లో ఉపాధ్యాయులు గత నెల రోజుల నుంచి ఇంటింటికీ తిరుగుతూ సర్కారు బడుల్లో బోధన గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి.. బడులను పునఃప్రారంభించడంలో సక్సెస్‌ సాధించారు.

నోట్‌బుక్స్‌, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ

పాఠశాలల పునఃప్రారంభం రోజు విద్యార్థులకు నోట్‌, పాఠ్య పుస్తకాలతో పాటు ఒక జత యూనిఫాం అందించారు. కొత్తగా అడ్మిషన్‌ పొందిన విద్యార్థులకు బుక్‌ బ్యాంకు నుంచి ఇవ్వగా.. తక్కువగా ఉన్న వారి కోసం సర్కారుకు ఇండెంట్‌ పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

అడ్మిషన్ల కోసం క్యూలు..

గతంలో ఎన్నడూ లేని విధంగా 2025–26 నూతన విద్యా సంవత్సరం మొదటి రోజు చాలా చోట్ల సర్కారు బడుల్లో అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు క్యూ కట్టారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌, బచ్చన్నపేట, రఘునాథపల్లి ఇలా అనేక పాఠశాలల పరిధిలో ఉపాధ్యాయులు ఊహించని విధంగా అడ్మిషన్లు తీసుకున్నారు. కలెక్టర ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు బడి బాట పట్టి వసతి సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, మధ్యాహ్న భోజన తయారీ, వడ్డింపు తదితరాలు పర్యవేక్షించారు.

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు: 548

విద్యార్థుల సంఖ్య: 45,000

మొదటి రోజు హాజరు శాతం: 69.8

న్యూస్‌రీల్‌

పునఃప్రారంభమైన పాఠశాలలు

విద్యార్థులకు పూలతో స్వాగతం

యూనిఫాంలో కొందరు....

కొత్త దుస్తుల్లో ఇంకొందరు

కలెక్టర్‌, డీఈఓ, ఉన్నతాధికారుల

పర్యటనలు

యాభై రోజుల తర్వాత మోగిన

పాఠశాల గంట

నోట్‌బుక్స్‌, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ

తొమ్మిది జీరో స్కూళ్లు రీఓపెన్‌

పుష్పాలిచ్చి.. స్వాగతించి!

నర్మెట: మండలంలోని మాన్‌ సింగ్‌తండా, కేజీబీవి, ఆగపేట పాఠశాలలను సందర్శించిన డీఈఓ భోజన్న విద్యార్థులకు గులాబీ పువ్వులు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్‌, స్కూల్‌ యూనిఫాంలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ మడిపల్లి ఐలయ్య, కాంప్లెక్స్‌ హెచ్‌ఎం నీలం వేణు, హెచ్‌ఎంలు పైడిపల్లి దామోదర్‌, గంగరాజు కేశవరావు, ఎస్‌ఓ బైరోజు రజిత, ఉపాధ్యాయులు రావుల రామ్మోహన్‌రెడ్డి ఉన్నారు.

పాఠ్యపుస్తకాల అందజేత

జనగామ రూరల్‌: బడిబాట సందర్భంగా మండలంలోని ఓబులకేశ్వాపూర్‌ ఉన్నత పాఠశాలలో డీఈఓ దర్శనం భోజన్న, ఎంఈఓ శంకర్‌ రెడ్డి గురువారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్‌లు, యూనిఫాం పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగిళ్ల నర్సింహారెడ్డి, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్‌ శ్రీమతి బత్తెపు ఉమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చదువుతోనే గౌరవం

ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుందని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు. గురువారం బడి బాటలో భాగంగా జనగామ మండలం ఎర్రకుంట తండా మండల ప్రజాపరిషత్‌ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్‌ పునఃప్రారంభించారు. ఎర్రకుంట పాఠశాలకు 28 మంది విద్యార్థులు వచ్చేలా కృషి చేసిన ఉపాధ్యాయురాలు రేష్మాను అభినందించారు. కలెక్టర్‌ చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్‌ అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ భోజయ్య, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్‌, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

బడి.. విద్యార్థుల సందడి1
1/5

బడి.. విద్యార్థుల సందడి

బడి.. విద్యార్థుల సందడి2
2/5

బడి.. విద్యార్థుల సందడి

బడి.. విద్యార్థుల సందడి3
3/5

బడి.. విద్యార్థుల సందడి

బడి.. విద్యార్థుల సందడి4
4/5

బడి.. విద్యార్థుల సందడి

బడి.. విద్యార్థుల సందడి5
5/5

బడి.. విద్యార్థుల సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement