ఉచిత విద్యుత్‌ బకాయిలు సత్వరం చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

ఉచిత విద్యుత్‌ బకాయిలు సత్వరం చెల్లించాలి

Jun 12 2025 7:33 AM | Updated on Jun 12 2025 7:35 AM

రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు

రఘునాథపల్లి: రజకులకు, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్‌ బకాయిలు సత్వరం చెల్లించాలని రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మైలా రం వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రజకుల సమస్యల పరిష్కారానికి ఈనెల 17న హైదరాబాద్‌ ఇందిరా పార్క్‌ వద్ద నిర్వహించే ధర్నా కరపత్రాలను బుధవారం స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆయా సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. గత ప్రభుత్వం రజకుల కు 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ కేటాయించగా.. ఈ ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించక పోవడం దారుణమన్నారు. రజకులకు, నాయీ బ్రాహ్మణుల కు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ప్రత్యేక ప్రాధాన్యంఇవ్వాలని, వయసు 50 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్‌, రజకులకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు మరికుక్కల సారయ్య, యాదగిరి, ధశరథ, సోమనాథ్‌, ఉమేష్‌, నాగరాజు, నర్సయ్య, నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు కల్పగూరి ప్రభాకర్‌, నరేష్‌, ప్రవీణ్‌, రాములు, శివయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement