కొత్త ఆవిష్కరణలకు నాంది | - | Sakshi
Sakshi News home page

కొత్త ఆవిష్కరణలకు నాంది

Jun 11 2025 8:58 AM | Updated on Jun 11 2025 8:58 AM

కొత్త

కొత్త ఆవిష్కరణలకు నాంది

జనగామ: మండలంలోని యశ్వంతాపూర్‌ క్రీస్తుజ్యో తి ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యార్థులు కొత్త ఆవి ష్కరణలకు శ్రీకారం చుట్టారు. టెక్నోజిల్‌–2025 కా ర్యక్రమంలో 350 ప్రదర్శనలతో తమలోని ప్రతి భను చాటుకున్నారు. మంగళవారం టెక్నోజిల్‌ కా ర్యక్రమాన్ని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి డైరెక్టర్‌ జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. జనగామ, హనుమకొండ, వరంగల్‌, కాజీపేట తది తర జిల్లాకు చెందిన 800 మంది విద్యార్థులు ఇందులో పాల్గొని నూతన ఆవిష్కరణలను పరిశీలించా రు. కంప్యూటర్‌, ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్‌, ఎలక్ట్రికల్‌ తదితర రంగాలకు సంబంధించిన ఆవిష్కరణ లను రెండు రోజుల పాటు ప్రదర్శించనున్నారు. అ నంతరం జరిగిన సదస్సులో డైరెక్టర్‌ విజయపాల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల అభ్యున్నతికి పాటు పడుతున్న అధ్యాపకుల కృషి అభినందనీయమన్నా రు. ప్రతీ విద్యార్థి అవకాశాలు సద్వినియోగం చేసుకుని, ఆదర్శంగా నిలవాలన్నారు. సీజేఐటీ కళాశాల విద్యార్థులు పరిశోధన, ప్రయోగాలకు ప్రతీకగా ని లుస్తున్నారన్నారు. అంతకు ముందు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టెక్నోజిల్‌ కన్వీనర్‌ అల్లంకి సన్యాసిరావు, కో కన్వీనర్‌ సరిత, కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె. యాకూబ్‌, అధ్యాపకులు విద్యార్థులు ఉన్నారు.

సీజేఐటీ టెక్నోజిల్‌–2025లో 350 ప్రదర్శనలు

అవకాశాలను అందిపుచ్చుకోవాలి

కళాశాల డైరెక్టర్‌ విజయపాల్‌రెడ్డి

కొత్త ఆవిష్కరణలకు నాంది1
1/1

కొత్త ఆవిష్కరణలకు నాంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement