
ప్రకాశం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొదిలి పొగాకు బోర్డును సందర్శించారు.

పోగాకు బేళ్లను పరిశీలించిన ఆయన.. ధరల వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎందుకు నష్టపోవాల్సి వస్తోంది? అని ఆరా తీశారు. మరోవైపు గిట్టుబాటు ధర లేక అల్లలాడిపోతున్న రైతులతో ముఖాముఖి నిర్వహించి.. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగన్ రాక నేపథ్యంలో పొదిలి మొత్తం జన సంద్రంగా మారింది.

అంతకు ముందు.. జగన్కు పొదిలిలో అపూర్వ స్వాగతం లభించింది. ఆయన్ని కలిసేందుకు.. చూసేందుకు భారీగా రైతులు, జనం తరలి వచ్చారు.

జై జగన్.. జైజై జగన్ నినాదాలతో హెరెత్తిచారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరగా.. ప్రజలకు అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు.

















