breaking news
podili
-
ఇక్కడే ధర్నా చేస్తా.. దమ్ముంటే అరెస్ట్ చేసుకో.. సీఐకి చెవిరెడ్డి వార్నింగ్
-
రైతులను రౌడీలుగా చూపిస్తూ.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి, గుంటూరు: ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో నిరసనల పేరిట ఉద్రిక్తతలకు కారణమైనవాళ్లను వదిలేసి.. అమాయక ప్రజలపై, రైతులపైనా కేసులు పెట్టడాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రంగా ఖండించారు. రైతుల సమస్యను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు సర్కార్ చేయిస్తున్న మరో దుర్మార్గమని ఎక్స్లో మండిపడ్డారాయన. చంద్రబాబు గారూ.. పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి నేను వెళ్తే, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా?. రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది రైతులు, ప్రజలు తరలివస్తే, మేం వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి, వారిని ఉసిగొల్పి, రాళ్లు విసిరి గలాటా చేయించారు. కాని ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారు. హింసను సృష్టించడానికి మీరు పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యలపైన.. అక్కడున్న 40 వేల మంది ప్రజలు, రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది?. రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఇలా చేయించడం దుర్మార్గం కాదా?.. .. పైగా ఉల్టా రాళ్లు మీవాళ్లు విసిరితే, మీరు ఉసిగొల్పిన మీ కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే, అన్యాయంగా రైతులపై, ప్రజలపై కేసులు పెడతారా?. ఆ కార్యక్రమానికి వచ్చిన రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా చంద్రబాబు గారూ?. రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా…, రైతుల సమస్యలను పట్టించుకోకుండా, తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది’’ అని వైఎస్ జగన్ తన పోస్టులో పేర్కొన్నారు..@ncbn గారూ పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి నేను వెళ్తే, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 14, 2025 -
యూట్యూబ్ చరిత్రలో నిలిచిపోయే వీడియో
-
ఇంటిపైకి ఎక్కి.. రాళ్లు, చెప్పులతో దాడి.. 3 కానిస్టేబుల్స్ తలకి గాయాలు
-
జనసంద్రాన్ని చూసి కూటమి వెన్నులో వణుకు మొదలైంది
-
జగన్ మామయ్య.. చిన్నారుల పిలుపుకు జగన్ రియాక్షన్
-
జగన్ను జనంలో తిరగనివ్వకూడదనే బాబు సర్కార్ టార్గెట్: వైఎస్సార్సీపీ
సాక్షి, ఒంగోలు: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలి పర్యటనలో తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా హింసకు కుట్ర పన్నిందని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ప్రకాశం జిల్లా కార్యాలయంలో పార్టీ ముఖ్యనాయకులతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు కిరాయి మనుషులతో రాక్షసంగా వైఎస్ జగన్ కాన్వాయిపై రాళ్ళు రువ్వి, ఉద్రిక్త పరిస్థితిని సృష్టించాలని ప్లాన్ చేశారని వారు మండిపడ్డారు.జెడ్ప్లస్ కేటగిరి ఉన్న నాయకుడి పర్యటన సందర్భంగా కాన్వాయికి అతి సమీపంలోకి అరాచకశక్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. వైఎస్ జగన్ను ప్రజల్లోకి తిరగనివ్వకూడదనే ఏకైక ఎజెండాతో కూటమి ప్రభుత్వం ఎటువంటి అరాచకానికైనా తెగబడుతోందని అన్నారు. ఎంతగా కవ్వించినా వైఎస్ జగన్, పార్టీ శ్రేణులు ధైర్యంగా రైతుల పక్షాన నిలబడ్డారని, పొగాకు కొనుగోళ్ళపై సర్కార్ అలసత్వాన్ని నిలదీశారని అన్నారు. ఇంకా వారు ఎమన్నారంటే.పొగాకు రైతుకు భరోసా కల్పించారు: ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డిమాజీ సీఎం వైఎస్ జగన్ పొదిలి వేలం కేంద్రంలో పొగాకు రైతులను పరామర్శించారు. పొగాకు కొనుగోళ్ళ విషయంలో ప్రభుత్వంను నిలదీశారు. రైతులకు అండగా వైఎస్సార్సీపీ నిలుస్తుందనే భరోసా కల్పించారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే నాయకుడు వైఎస్ జగన్. అందుకే ఆయన సీఎం అయిన తరువాత రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో పొగాకు రైతులు గిట్టుబాటుధర లేక అల్లాడుతుంటే ప్రభుత్వం తరుఫున మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించారు.పొగాకు రైతులకు అండగా ఉంటేందుకు పొదిలి వేలం కేంద్రానికి వస్తుంటే, టీడీపీ మహిళలను అడ్డం పెట్టకుని ఆయన పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. చెప్పులు, రాళ్ళు విసిరి అరాచకం సృష్టించేందుకు తెగబడ్డారు. రైతుల కోసం వచ్చిన ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకోవడం విడ్డూరంగా ఉంది. పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్ళించాలనే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ రకంగా టీడీపీ కుట్రకు పాల్పడింది. ఈ రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్ తరువాత మహిళలకు అగ్రస్థానంలో నిలబెట్టిన నాయకుడు వైఎస్ జగన్.రాష్ట్రంలో ఆయన పాలనలో మహిళలకే అధికశాతం పథకాలను అమలు చేశారు. ఈ రోజు తన ర్యాలీలో కూడా మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నా, ఆ మహిళలకు నమస్కారం చెస్తూ వెళ్ళిపోయారే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ వస్తున్నారనే విషయం, ఆయన పర్యటన గురించి ముందుగానే తెలిసి, ఆయన కార్యక్రమాన్ని ఏదో ఒక విధంగా విఫలం చేయాలనే దుష్టతలంపుతోనే టీడీపీ ఈ రకంగా మహిళల ముసుగులో దిగజారుడు రాజకీయం చేసింది. పోటీ కార్యక్రమాన్ని నిర్వహించి, రాళ్లు రువ్వడం ద్వారా భయాందోళనలకు గురి చేసిందని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మండిపడ్డారు.మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే నేతృత్వంలో కుట్ర: మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుపొగాకు కొనుగోళ్ళ విషయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో రైతులను ఆదుకోవాలనే లక్ష్యంలో మాజీ సీఎం, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వచ్చి రైతులతో మాట్లాడారు. పొగాకు రైతులకు గిట్టుబాటు రేటు కల్పించాలని, ప్రభుత్వ పరంగా కొనుగోళ్ళు చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అయితే వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళల నిరసనల పేరుతో రాళ్ళు రువ్వుతూ గందరగోళ పరిస్థితులను సృష్టించింది. ఈ రాళ్ళ దాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, కొందరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ ఏదైనా నిరసనలు చేయాలంటే ప్రజాస్వామిక విధానాల్లో, శాంతియుత పద్దతుల్లో నిర్వహించాలే తప్ప ఈ రకంగా రైతుల గురించి మాట్లాడేందుకు వచ్చిన ప్రతిపక్ష నేత పర్యటనపై రాళ్ళ దాడి చేయడం దారుణం. మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలోనే కార్యకర్తలను రెచ్చగొట్టి, ఇటువంటి అరాచకానికి ప్రోత్సహించారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆయన పొదిలిలో ఎందుకు తిరిగాడో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు డిమాండ్ చేశారు.టీడీపీ నేతలు సిగ్గుపడాలి: చుండూరి రవికిరాయి మనుషులతో తెలుగుదేశం నాయకులు వైయస్ జగన్ పర్యటనపై రాళ్ళు రువ్వించారు. ఒక మంచి సమస్యపై లక్షలాది మంది రైతులకు మేలు చేయాలని వైయస్ జగన్ జిల్లాకు వస్తే, దానిని భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు టీడీపీ నేతలు సిగ్గుపడాలి. వ్యాపారులతో ప్రభుత్వం కుమ్ముక్కు అవ్వడం వల్లే పొగాకు కు గిట్టుబాటు రేటు రావడం లేదు. ఇటువంటి దుష్ట సంస్కృతిని ప్రోత్సహిస్తే సమాజంలో అరాచకం మరింత పెరుగుతుందని చుండూరి రవి అన్నారు. -
పొదిలి ఘటన, కొమ్మినేని అరెస్ట్ పె వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్
-
వైఎస్ జగన్ కు రైతులు, అభిమానులు భారీ స్వాగతం
-
లోకేష్ పర్యవేక్షణలోనే పొదిలి ఘటన: అంబటి
సాక్షి, గుంటూరు: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొదిలి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై వైఎస్సార్సీపీ స్పందించింది. ఇదంతా ఆర్గనైజ్డ్గా వ్యవహారమని, మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..జగన్ పొదిలి వెళ్లింది పొగాకు రైతులకు మద్దతు తెలిపేందుకు. గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడిపోతున్నారు. జగన్ రాక నేపథ్యంలో జనం భారీగా తరలి వచ్చారు. నలుగురైదుగురు మహిళలను పెట్టి నిరసన చేయించింది టీడీపీ నాయకులే. తెనాలి పర్యటన సమయంలోనూ ఇలాగే చేశారు. జగన్ పర్యటనల్లో నిరసనలు జరిగేలా మంత్రి నారా లోకేష్ చేస్తున్నారు. పొదిలి వ్యవహారాన్ని లోకేష్ దగ్గరుండి పర్యవేక్షించారు. నల్లబెలూన్లు ఎగరేయడం, చెప్పులు విసిరించడం ఆర్గనైజ్డ్ కాదా? జగన్ పర్యటనలు చేయకూడదా?. మీరు అధికారంలో శాశ్వతంగా ఉంటారా? అని అంబటి ప్రశ్నించారు. .. పోలీస్ వ్యవస్థ టీడీపీ నాయకులకు అండగా ఉంది. వైఎస్సార్సీపీ నేతలపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తోంది. ఇదంతా లోకేష్ ఆధ్వర్యంలోనే నడుస్తోంది ఆ వేధింపులు, బెదిరింపులు భరించలేక కొందరు బలవన్మరణానికి ప్రయత్నిస్తున్నారు. రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన లక్ష్మీనారాయణ వైఎస్సార్సీపీ కార్యకర్త. ఆయన్ని గత కొన్ని రోజులుగా సివిల్ మ్యాటర్లో పోలీసులు వేధిస్తున్నారు. లక్ష్మీ నారాయణను సత్తెనపల్లి డీఎస్పీ బూతులు తిట్టారు. ఆ వేధింపులు భరించలేకనే ఆయన సెల్ఫీ వీడియో తీసి సూసైడ్కు ప్రయత్నించారు. ఆ వేధింపులు ఏస్థాయిలో ఉన్నాయో ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది.... ప్రస్తుతం లక్ష్మీ నారాయణ గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ రేపు(గురువారం, జూన్ 12) వస్తున్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంపై జనం తిరగబడతారు. తూటాలు ఉపయోగించే పరిస్థితి కూడా రావొచ్చు’’ అని అంబటి జోస్యం పలికారు. -
పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: వైఎస్ జగన్
-
YS Jagan: చంద్రబాబు అబద్ధాలకు ఆరుగురు రైతులు బలైపోయారు
-
వ్యవసాయాన్ని గాలికి వదిలేసిన చంద్రబాబు సర్కార్
-
జగన్ పొదిలి పర్యటనలో జనప్రభంజనం (చిత్రాలు)
-
జగన్ రాకతో జనసంద్రమైన పొదిలి.. డ్రోన్ విజువల్స్
-
మోదీ ఇచ్చారు.. చంద్రబాబు ఎగ్గొట్టారు: వైఎస్ జగన్
సాక్షి, ప్రకాశం: రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకునే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదని, చంద్రబాబు సీఎం కావడం రైతుల పాలిట శాపమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పొదిలి పొగాకు బోర్డును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇవాళ రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రైతులను పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లాలో(పరుచూరు, కొండెపి) ఇటీవలే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మద్దతు ధర కంటే తక్కవకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. మా హయాంలో రైతు రాజ్యం నడిచింది. కానీ, కూటమి ప్రభుత్వంలో రైతు నష్టపోతున్నాడు. మా హయాంలో ఖరీఫ్ సీజన్లోనే పెట్టుబడి సాయం అందించాం. చంద్రబాబు వచ్చాక రైతు భరోసా సాయం లేదు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా మరో రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు అన్నారు. గతేడాది రైతు భరోసా రూ.20 ఎగ్గొట్టారు. మోదీ ఇచ్చారు.. చంద్రబాబు ఎగ్గొట్టారు మా హయాం.. రైతులకు స్వర్ణయుగంమా ప్రభుత్వంలో రైతుకు కనీస మద్దతు ధర ఇచ్చాం. ప్రతీ రైతుకు అదనంగా రూ.10 వేలు ఇచ్చేవాళ్లం. పారదర్శకంగా ఉచిత బీమా అందించాం. మా హయాంలో రైతుకు వెన్నెముకగా ఆర్బీకే(రైతు భరోసా కేంద్రాలు)లు నిలిచాయి. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. మార్కెట్లో పోటీ పెరిగి రైతుకు గిట్టుబాటు ధర వచ్చేది. కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా.. రాష్ట్రం నుంచి అనేక పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చాం. ఏ పంటకైనా గిట్టుబాటు ధర లేకుంటే ఆర్బీకే ద్వారా ఇచ్చేవాళ్లం. ఐదెకరాల మిర్చి రైతులకు రూ.4లక్షల పరిహారం ఇచ్చిన ఘనత మాది. మా హయాంలో రైతులకు సువర్ణ యుగం. ఏ రకంగానూ రైతును నష్టపోనివ్వలేదు.కూటమి పాలనలో అధ్వానంకూటమి వచ్చాక ఉచిత బీమా ఎత్తేశారు. దళారీలు లేకుండా ఇప్పుడు పంట కొనే పరిస్థితి లేదు. ఈ క్రాప్ వ్యవస్థను నీరుగార్చారు. కూటమి వచ్చాక ఇన్పుట్ సబ్సీడీని గాలికొదిలేశారు. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలతో నష్టపోతున్నారు. 2023-24లో కేజీ పొగాకు రూ.366కి అమ్ముడుపోయేది. ఇప్పుడు రూ.240 కూడా అమ్ముడుపోవడం లేదు. క్వింటా పొగాకు రూ.24 వేలు తగ్గకుండా రైతు అమ్ముకున్నాడు. 220 మిలియన్ టన్నులు ప్రొక్యూర్ చేయాల్సి ఉంటే.. కేవలం 40 మిలియన్ టన్నులే ప్రొక్యూర్ చేశారు. హైగ్రేడ్ పొగాకుకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర దక్కడం లేదు. పొగాకు బ్లాక్ బర్లీ రైతు ఎకరాకు రూ.80వేలు నష్టపోతున్నాడు. చంద్రబాబు సీఎం కావడం రైతులకు శాపం. మా హయాంలో మార్క్ఫెడ్ను రంగంలోకి దించాం. మార్క్ఫెడ్ రావడంతో మార్కెట్లో పోటీ పెరిగింది. మీరెందుకు ఆ పని చేయలేదు?. అసలు ప్రభుత్వం ఎందుకు మార్క్ఫెడ్ వేలంలో పాల్గొనలేదు. బాబు, దళారుల మధ్య సంబంధాలతో రైతులు నష్టపోతున్నారు. చంద్రబాబుకు జగన్ హెచ్చరికవ్యవసాయం దండగ అనే రీతిలో చంద్రబాబు పాలన కొనసాగుతోంది. పొగాకు వేసుకోమని చెప్పి రైతులను నట్టేట ముంచుతున్నారు. రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం జగన్ హెచ్చరికలు జారీ చేశారు. -
కూటమి దుర్మార్గాలపై YS జగన్ సంచలన ప్రెస్ మీట్
-
జగన్ రాకతో దిగొచ్చిన కూటమి..
-
వైఎస్ జగన్ రాక.. పోటెత్తిన అభిమానం
-
Watch Live: పొగాకు రైతులకు అండగా.. పొదిలికి YS జగన్
-
పొగాకు రైతులు ఎందుకు నష్టపోతున్నారు?: వైఎస్ జగన్ ఆరా
సాక్షి, ప్రకాశం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొదిలి పొగాకు బోర్డును సందర్శించారు. పోగాకు బేళ్లను పరిశీలించిన ఆయన.. ధరల వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎందుకు నష్టపోవాల్సి వస్తోంది? అని ఆరా తీశారు. మరోవైపు గిట్టుబాటు ధర లేక అల్లలాడిపోతున్న రైతులతో ముఖాముఖి నిర్వహించి.. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగన్ రాక నేపథ్యంలో పొదిలి మొత్తం జన సంద్రంగా మారింది.అంతకు ముందు.. జగన్కు పొదిలిలో అపూర్వ స్వాగతం లభించింది. ఆయన్ని కలిసేందుకు.. చూసేందుకు భారీగా రైతులు, జనం తరలి వచ్చారు. జై జగన్.. జైజై జగన్ నినాదాలతో హెరెత్తిచారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరగా.. ప్రజలకు అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. కొందరు రైతులు ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడారు. ‘‘మా పరిస్థితి ఏం బాగా లేదు. మిర్చి రైతుల దగ్గరి నుంచి అంతా నష్టాల్లోనే ఉన్నాం. టిఫిన్ తినడానికి కూడా డబ్బుల్లేవు. జగన్ పాలనలోనే మా పరిస్థితి బాగుంది. కూటమి పాలనలో మా పరిస్థితి అధ్వాన్నం. జగన్ హయాంలో కేంద్రంతో మాట్లాడి మాకు న్యాయం చేశారు.. .. ఇప్పుడు రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు. గిట్టుబాటు ధర లేక ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మా పరిస్థితి బాలేదని చెప్పుకున్నా అరెస్ట్ చేస్తున్నారు. వైఎస్సార్, జగన్ పాలనలో రైతులకు మంచి జరిగింది. కూటమి పాలనలో వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. ఒక్కో పొగాకు బేళ్లకు రూ.3 వేలు నష్టం. కనీసం ఇవాళ్టి జగన్ పర్యటనతోనైనా గిట్టుబాటు ధర ఇచ్చే అవకాశం ఉంది. 2029లో కూటమి ప్రభుత్వాన్ని పడగొడతాం’’ అని కొందరు పొగాకు రైతులు సాక్షితో అన్నారు. జగన్ వస్తున్నాడయ్యా.. త్వరగా కానివ్వండి!ఏడాది కాలంగా పొగాకు రైతులను కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే జగన్ రాక నేపథ్యంలో పొగాకు ఆక్షన్ పూర్తి చేయాలని ఆగమేఘాల మీద అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఆక్షన్ త్వరగతిన పూర్తి చేయాలని బోర్డుపై కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేసినట్లు సమాచారం. దీంతో ఈ ఉదయం నుంచి రైతులు లేకుండానే అధికారులు ఆక్షన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా ఏకంగా తొంబై శాతం బేళ్లు కొనుగోలు జరిగినట్లు సమాచారం. మాములు రోజుల్లో ఇలా అసలు ఉండదు. రైతుల సమక్షంలోనే బోర్డు ఆక్షన్ నిర్వహిస్తోంది. పైగా వచ్చిన బేళ్లలో 40 శాతం మాత్రమే కొనుగోలు జరుగుతోంది. అయితే.. ఇవాళ అందుకు భిన్నంగా అన్నీజరిగిపోతున్నాయి. పొగాకు రైతులను ఈ ఏడాది కాలంగా ఏమాత్రం పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం. ఇంతకాలం గిట్టుబాటు ధర లేక వాళ్లు అల్లలాడిపోయారు. ఈ తరుణంలో జగన్ రాక సందర్భంగా హడావిడిగా ఆక్షన్ నిర్వహిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
నేడు ప్రకాశం జిల్లా పొదిలిలో వైఎస్ జగన్ పర్యటన
-
నేడు ప్రకాశం జిల్లా పొదిలికి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించనున్నారు. పొగాకు రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకోనున్నారు.పొదిలి పొగాకు బోర్డును సందర్శించి.. రైతులతో ముఖాముఖి చర్చించనున్నారు. వైఎస్ జగన్ బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి పొదిలికి బయల్దేరుతారు. పొగాకు బోర్డును సందర్శించి పొగాకు రైతులతో ముఖాముఖి అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
మరో పోరాటానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ శ్రీకారం
-
11న పొదిలికి వైఎస్ జగన్
పొదిలి రూరల్: పొగాకు రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 11న ప్రకాశం జిల్లా పొదిలికి రానున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి తెలిపారు. శనివారం పొదిలి–దర్శి రోడ్డులోని ఎస్ఆర్ పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ స్థలాన్ని వైఎస్సార్సీపీ ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, అన్నా కృష్ణచైతన్యతో కలిసి పరిశీలించారు.అనంతరం శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ గత నెల 28న పొదిలి పొగాకు బోర్డును వైఎస్ జగన్ సందర్శించాల్సి ఉండగా, వాతావరణ పరిస్థితుల వల్ల వాయిదా పడిందని పేర్కొన్నారు. ఈ నెల 11న కార్యక్రమం ఖరారైనట్లు చెప్పారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు పొదిలి పొగాకు బోర్డుకు వైఎస్ జగన్ చేరుకుంటారన్నారు. వైఎస్ జగన్ రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి కష్టాలు తెలుసుకుని భరోసా కల్పిస్తారని వివరించారు.అనంతరం మీడియా సమావేశం నిర్వహిస్తారని వెల్లడించారు. హెలిప్యాడ్ ప్రాంతంలో చేపట్టాల్సిన పనులు వేగవంతం చేయాలని బూచేపల్లి సిబ్బందికి సూచించారు. వారి వెంట వైఎస్సార్సీపీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, కేవీ రమణారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, వైఎం ప్రసాద్రెడ్డి, వై.వెంకటేశ్వరరావు, కె.నరసింహారావు తదితరులు ఉన్నారు. -
YS Jagan: పొదిలి పర్యటన వాయిదా
సాక్షి, ప్రకాశం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) పొదిలి పర్యటన వాయిదా పడింది. రేపు(బుధవారం, మే 28) ఆయన అక్కడ పర్యటించాల్సి ఉంది. అయితే.. భారీ వర్షాల నేపథ్యంతో పొదిలి పర్యటన(Podili Tour) వాయిదా పడిందని వైఎస్సార్సీపీ ఓ ప్రకటనలో తెలిపింది. వాతావరణం అనుకూలించిన తర్వాత పర్యటన విషయమై తదుపరి ప్రకటన చేస్తామని వెల్లడించింది. కూటమి పాలన(Kutami Prabhutvam)లో మద్ధతు ధర లేక రైతాంగం అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి స్వయంగా వారి సమస్యలు తెలుసుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు.ఇదీ చదవండి: కోనసీమ విషాదంపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి -
ఈనెల 28న పొదిలికి వైఎస్ జగన్ వస్తున్నారు: అన్నా రాంబాబు
-
జగన్ పొదిలి పర్యటన.. టీడీపీ నేతలకు చెమటలు
-
స్వచ్ఛ అవార్డుతో అభివృద్ధికి బాటలు
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, నగరాలలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు.. ప్రజల్లో అవగాహన కల్పించే పట్టణాలు, నగరాలకు స్వచ్ఛతా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అందులో భాగంగా పొదిలి నగర పంచాయతీ జాతీయ స్థాయి అవార్డు అందుకుంది. దీంతో స్వచ్ఛ పొదిలి దిశswachh awardsగా మరిన్ని చర్యలు తీసుకునేందుకు నిధుల లభ్యత కలగనుంది. పొదిలి(ప్రకాశం జిల్లా): నగర పంచాయతీగా ఉన్న పొదిలికి స్వచ్ఛ పురస్కారం వరించింది. సుమారు 40 వేల జనాభా, 20 వార్డులతో ఉన్న నగర పంచాయతీలో 12 వేల గృహాలు ఉన్నాయి. మేజర్ పంచాయతీ నుంచి 2021లో నగర పంచాయతీగా అప్గ్రేడ్ అయిన పట్టణంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఏటా రూ.1.30 కోట్ల ఇంటి పన్నుల డిమాండ్ ఉంది. ప్రత్యేక కేటగిరీలో అవార్డు: స్వచ్ఛత లీగ్లో భాగంగా ప్రత్యేక కేటగిరీలో పొదిలి జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికైంది. 15 వేల జనాభా విభాగం కింద అవార్డు ఇచ్చారు. గత నెల 30వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కౌశల్ కిషోర్ చేతుల మీదుగా నగర పంచాయతీ కమిషనర్ డానియేల్ జోషెఫ్ అవార్డు అందుకున్నారు. జాయిన్ ద ఫైట్ ఫర్ గార్బేజ్ సిటీస్ నినాదంతో ముందుకు సాగేందుకు అవార్డు ఉపకరిస్తుంది. టీమ్కు నచ్చటంతోనే సర్వే ప్రారంభం: పట్టణంలో పారిశుధ్య పనులు ఊపందుకున్నాయి. నగరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. ఈక్రమంలో ఇంటింటికీ చెత్తబుట్టల పంపిణీ, పరిశుభ్రతపై నిర్వహించే అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేకంగా ఆగస్టులో నిర్వహించిన స్వచ్ఛత మహోత్సవ ర్యాలీలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారు. దీంతో కేంద్రం నుంచి వచ్చిన టీమ్ సభ్యులు సర్వే ప్రారంభించారు. నిబంధనల మేర అన్నీ జరుగుతున్నాయని టీమ్ సభ్యులు ఇచ్చిన నివేదికల ఆధారంగా నగర పంచాయతీకి అవార్డు వరించింది. నీటి సమస్య తీర్చాలనే లక్ష్యంతో... నగర పంచాయతీ పరిధిలో మంచినీటి సమస్య తీర్చాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. సాగర్ నీరు పెద్ద చెరువుకు చేర్చి, దాని ద్వారా ఇంటింటికీ కొళాయిల ద్వారా పంపిణీ చేయనున్నారు. దీని కోసం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయటంతోపాటు, నీటి కేటాయింపులు కూడా పూర్తయ్యాయి. శుద్ధీకరణ ప్లాంట్ల ఏర్పాటు దిశగా... కాలుష్య నివారణ, నీరు కలుషితం కాకుండా చేయటానికి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉద్యమంగా జరుగుతోంది. ఎస్టీపీ, ఎఫ్ఎస్టీపీ కేంద్రాలు ఏర్పాటు చేయటానికి అవకాశాలపై టీం సభ్యులు సర్వే నిర్వహించారు. సీవేజ్ ట్రాన్స్పోర్ట్ ప్లాంట్ (ఎస్టీపీ) ఏర్పాటు చేయటం ద్వారా మురుగునీటిని శుద్ధి చేస్తారు. మరో వైపు ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ ద్వారా మల, మూత్రాలను ఒకే చోటికి చేర్చి శుద్ధీకరణకు ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. అయితే ఇవి ఏర్పాటుకు మురుగునీరు, మలం రెండు వేరు వేరుగా ఒకే చోటకు చేరే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసేందుకు టీమ్ చేసిన సర్వేలో అనువుగా ఉందని గుర్తించటంతో ప్లాంట్ల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. దీని ఏర్పాటుకు కోట్ల రూపాయల నిధులు మంజూరవుతాయి. అభివృద్ధి లక్ష్యంతో సమన్వయంతో పనిచేస్తున్నారు నగర పంచాయతీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సమన్వయంతో అందరూ పనిచేస్తున్నారు. తొలి ప్రాధాన్యతగా మంచినీటి సమస్య పరిష్కారం కోసం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయించుకున్నాం. మరో వైపు నగర పంచాయతీ కార్యాలయం భవనాల కోసం స్థల పరిశీలన తుది దశకు చేరుకుంది. సీపేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేస్తున్నాను. శుద్ధీకరణ ప్లాంట్లు ఏర్పాటు దశకు వస్తాయి. అన్ని విధాలుగా నగర పంచాయతీ అభివృద్ధి చేసేందుకు అవసరమైన పథకాలను, నిధులు మంజూరు చేయిస్తాం. – కేపీ.నాగార్జునరెడ్డి, ఎమ్మెల్యే. అవార్డుతో అభివృద్ధికి బాటలు జాతీయ అవార్డు అందుకోవటం ఆనందంగా ఉంది. ప్రతి విషయంలోనూ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి ప్రోత్సాహంతోనే అవార్డుకు అర్హత సాధించాం. దీని వల్ల పట్టణానికి భవిష్యత్లో ఎంతో మేలు జరుగుతుంది. శుద్ధీకరణ ప్లాంట్లు కార్యరూపం దాల్చితే కోట్ల నిధులు రావటంతో పాటు, కాలుష్యం లేకుండా పోతుంది. ప్రస్తుతానికి కంపాక్ట్ వాహనం (8 టన్నుల చెత్తను రవాణా చేసే వాహనం) అందిస్తారు. దీంతో పాటు చెత్త రవాణా కోసం అవసరమైన వాహనాలను సమకూర్చుతారు. ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, నగర పంచాయతీ అధికారులు, పారిశుధ్య కార్మికులు అందరికీ కృతజ్ఞతలు. – డానియేల్ జోషెఫ్, కమిషనర్ -
గుప్త నిధుల తవ్వకాల కేసులో ఏడుగురు అరెస్టు
పొదిలి(ప్రకాశం జిల్లా): గుప్త నిధుల కోసం చెరువులో తవ్వకానికి పాల్పడిన ఘటనలో ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పొదిలి సీఐ సుధాకర్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం సాయంత్రం నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. తర్లుపాడు మండలం పోతలపాడు దశబంధు చెరువులో ఆదివారం అర్ధరాత్రి గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు తవ్వకాలు చేపట్టారు. రాత్రి వేళ గస్తీ తిరుగుతున్న గ్రామ రక్షక దళానికి గుప్త నిధుల ముఠా పట్టుబడింది. మొత్తం తొమ్మిది మందిలో ఏడుగురు చిక్కగా మరో ఇద్దరు పరారయ్యారు. పట్టుబడిన వారిని సోమవారం అరెస్ట్ చేశామని, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. అరెస్టు అయిన వారిలో నరసరావుపేటకు చెందిన సయ్యద్ ఖరీం, డీకే మీరావలి, ఎస్కే సుభాని, బత్తుల శ్రీనివాసరావు, తమ్మిశెట్టి మణి, గురజాలకు చెందిన మన్నం శ్రీనివాస్, నామనకొల్లు గ్రామానికి చెందిన సయ్యద్బాజీ ఉన్నారని సీఐ పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. నిందితుల నుంచి 7 సెల్ఫోన్లు, 2 కార్లు, 2 గడ్డపారలు, 2 చలకపారలు, ఒక బొచ్చె, ఒక పెద్ద సుత్తి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో తర్లుపాడు ఎస్ఐ సువర్ణ, ఎస్బీ సంజయ్, హెడ్ కానిస్టేబుల్ రమేష్, కాశిరెడ్డి పాల్గొన్నారు. చదవండి: ఒక్క రోజులోనే 663 ఒమిక్రాన్ కేసులు.. ‘ఏప్రిల్ నాటికి వేల సంఖ్యలో మరణాలు’! -
పతే ప్రత్యక్ష ‘దైవం’గా భావిస్తూ భర్తకు గుడి కట్టిన భార్య
సాక్షి, పొదిలి: కడదాక కలిసుంటానని బాస చేసిన భర్త అర్ధాంతరంగా తనువు చాలించడంతో భార్య తట్టుకోలేకపోయింది. భర్తను తలచుకుంటూనే కాలం వెళ్లదీస్తోంది. ఈ క్రమంలో భర్తను దైవంగా భావించే ఆమె ఏకంగా ఓ గుడికట్టించింది. నిత్యం పూజలందిస్తున్నది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా పొదిలి మండలం నిమ్మవరం గ్రామానికి చెందిన అంకి రెడ్డి, పద్మావతి భార్యాభర్తలు. అంకిరెడ్డి నాలుగేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భర్త అంకిరెడ్డిని స్మరించుకుంటూ ఉంటోంది. భర్త మాదిరి పాలరాతి విగ్రహం చేయించి ప్రతిష్టించింది. నిత్యం పూజలు చేస్తూనే సమాజ సేవకులకు సన్మానిస్తున్నారు. భర్త స్నేహితుడు తిరుపతిరెడ్డి సహకారంతో కుమారుడు శివశంకర్ రెడ్డితో కలిసి ఆమె సేవలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రతి పౌర్ణమికి శని, ఆదివారాల్లో పేదలకు అన్నదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. అలా భర్తను సేవిస్తూ తన ప్రేమను చాటుకుంటోంది. -
పొదిలి–టంగుటూరు రోడ్డుకు మహర్దశ
కొండపి: జిల్లాలోని పశ్చిమ ప్రాంతం నుంచి తూర్పున ఉన్న చెన్త్నె నేషనల్ హైవేని అనుసంధానిస్తూ పొదిలి– టంగుటూరు ఆర్అండ్బీ రహదారికి ప్రభుత్వం సుమారు రూ.40 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో టంగుటూరు–పొదిలి ఆర్అండ్బీ రోడ్డుకు మహర్దశ పట్టనుంది. ఈమేరకు మరో నెల రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన దొనకొండను ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రకటించింది. దొనకొండ నుంచి నెల్లూరు జిల్లాలోని క్రిష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు పొదిలి వయా కొండపి మీదుగా టంగుటూరు వద్ద కలిసే చెన్త్నె హైవేకు దొనకొండ నుంచి దూరం తగ్గనుండటంతో ప్రభుత్వం ఈ రహదారిని అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది. దొనకొండ నుంచి ఈ రహదారి గుండా క్రిష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు దగ్గర రహదారి కావటంతో ప్రభుత్వం సింగిల్ రోడ్డుగా ఉన్న మర్రిపూడి మండలంలోని 49 కిలో మీటరు కూచిపూడి నుంచి 66 కిలో మీటరు పొదిలి వరకు 17 కిలోమీటర్ల మేర రోడ్డును 3.66 మీటర్ల నుంచి 7 మీటర్లకు విస్తరణ చేయనుంది. అదే విధంగా పెట్లూరులో 3 కిలోమీటర్ల మేర 5.50 మీటర్ల రోడ్డును 7 మీటర్లుగా, టంగుటూరు వద్ద ఒక కిలో మీటరు రోడ్డును విస్తరించనుంది. దీంతో పాటు మర్రిపూడి, గంగపాలెం, జాళ్లవాగువద్ద సుమారు రూ.2 కోట్లతో హైలెవల్ బ్రిడ్జిలను సైతం నిర్మించనుంది. దీంతో పొదిలి నుంచి టంగుటూరు వరకు 66 కిలో మీటర్ల ఆర్అండ్బీ రోడ్డు విస్తరణ పనులు పూర్తయి రవాణాకు అనుకూలంగా మారుతుంది. ఈ రహదారి నిర్మాణంతో జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం, కొండపి నియోజకవర్గాల్లోని వందలాది గ్రామాల ప్రజలకు ఈ రహదారి నిర్మాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. రహదారి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయటంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు టంగుటూరు – పొదిలి మధ్య మొత్తం 66 కిలో మీటర్ల దూరం ఉండగా గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కొండపి నుంచి మర్రిపూడి మండలం వరకు రహదారి విస్తరణ పనులు జరిగాయి. తాజాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దొనకొండ, రామాయపట్నం పోర్టును దృష్టిలో పెట్టుకుని ఈ రహదారికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. దీంతో పొదిలి నుంచి నేషనల్ హైవేకి 10 కిలోమీటర్ల దూరం తగ్గటమే కాకుండా టోల్గేట్ సైతం లేకుండా రవాణాకు ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ప్రజలు ఆనందిస్తున్నారు. ఏదేమైనా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రోడ్డు విస్తరణ పనులకు నిధులు మంజూరు కావటంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయమై కొండపి ఇన్చార్జి ఏఈని వివరణ కోరగా రూ.40 కోట్లు ఎన్డీబీ నిధులు మంజూరయ్యాయని, టెండర్ దశలో ఉందని టెండర్ ప్రక్రియ అనంతరం పనులు మొదలు పెడతామన్నారు. -
వైన్స్లో కల్తీ మద్యం
సాక్షి, పొదిలి (ప్రకాశం): స్థానిక ఆర్టీసీ సెంటర్ గేట్ ఎదుట ఉన్న జీఆర్ వైన్స్లోని పర్మిట్ రూమ్పై ఎన్ఫోర్స్మెంట్ సీఐ తిరుపతయ్య ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్కడ కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం వైన్స్పై కూడా దాడులు నిర్వహించారు. స్థానిక ఎక్సైజ్ పోలీసుస్టేషన్లో సాయంత్రం ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ వై.శ్రీనివాస చౌదరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. సీఐ తిరుపతయ్య ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో కల్లీ మద్యం తయారీ, విక్రయాలకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకుని దాన్ని విక్రయిస్తున్న ఇద్దరితో పాటు, లైసెన్స్దారుడు, నిర్వాహకులు మొత్తం నలుగురిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. దుకాణం సిబ్బందిని విచారించగా దుకాణం లీజుదారుడి సూచనల మేరకే తాము ఈ పని చేస్తున్నట్లు అంగీకరించారన్నారు. లైసెన్స్ మద్యం దుకాణం ద్వారా కల్తీకి పాల్పడుతున్నందున జీఆర్ దుకాణం లైసెన్స్ను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫారస్ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. లైసెన్స్దారుడు వి.అనిల్, లీజుదారుడు జి.రమణారెడ్డిపై కేసు నమోదు చేశామన్నారు. దుకాణంలో ఉన్న 2604 మద్యం సీసాలు, 216 బీరు బాటిళ్లు, రూ.5003 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దుకాణంలో పనిచేస్తున్న షాహిద్, అబ్దుల్ జబ్బార్లను అరెస్టు చేశామన్నారు. లైసెన్స్దారుడు, లీజుదారుడిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని చౌదరి వివరించారు. వెంటనే సమాచారం ఇవ్వాలి మద్యం దుకాణాలకు సంబంధించి అక్రమాలు జరుగుతుంటే వెంటనే సమాచారం అందించాలని చౌదరి కోరారు. కల్తీ జరుగుతున్నా, అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నా, గొలుసు దుకాణాలు నిర్వహిస్తున్నా తమ దృష్టికి తీసుకరావాలని సూచించారు. మర్రిపూడి మండలం జంగాలపల్లి దుకాణంపై దాడి చేసి లోపాలు గుర్తించి లైసెన్స్ ఆపేందుకు ఉన్నతాధికారులకు సిఫారస్ చేశామని చెప్పారు. వై.పాలెం, గిద్దలూరు, కనిగిరి, చీరాల పరిధిలో నాటుసారా తయారీ కేంద్రాలను గుర్తించి దాడులు నిర్వహించామని స్పష్టం చేశారు. -
వెబ్ల్యాండ్ మంచిది కాదు
పొదిలి/కొనకనమిట్ల : రెవెన్యూ వెబ్ల్యాండ్ ఆధారంగా భూముల క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు చేయాలని, బ్యాంకులు పంట రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ‘మీ భూమి’ వెబ్ల్యాండ్లో లోపాల వల్ల రైతులు పడుతున్న కష్టాలు, రెవెన్యూ అధికారుల అక్రమాలతో వెబ్ల్యాంబ్ బాధిత రైతులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందకు ‘సాక్షి’ నడుంబిగించింది. మార్కాపురం నియోజకవర్గంలో పొదిలి మండలం ఆముదాలపల్లి, కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో గురువారం అవగాహన సదస్సులు నిర్వహించింది. ‘వెబ్ల్యాండ్ అమలు చేయడం వల్ల అవకతవకలు, అక్రమాలు జరిగే అవకాశం ఉంది. భూమి క్రయ, విక్రయాల్లో తప్పులు జరుగుతున్నాయి. అసలు రికార్డులు సవరించకుండా వెబ్ల్యాండ్ అమలు చేయడం మంచిది కాదు’ అని పలువురు రైతులు సదస్సు దృష్టికి తెచ్చారు. గొట్లగట్టు పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన సదస్సులో తహశీల్దార్ జ్వాలా నరసింహం మాట్లాడుతూ.. ‘వెబ్ల్యాండ్లో సమస్యలుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. జీఓ నెం.271 వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, పాత విధానమే బాగుందని రైతులు అంటున్నారు. ఈ–పాస్ పుస్తకాలకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఒక పుస్తకం (ఈ పాస్) ద్వారానే బ్యాంక్ల్లో రుణ ం ఇస్తున్నారు. సహకార బ్యాంక్ల్లో రుణాలివ్వని విషయంతోపాటు మిగిలిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం’ అన్నారు. ఆముదాలపల్లిలో వెబ్ ల్యాంyŠ అవగాహన సదస్సులో తహశీల్దార్ విద్యాసాగరుడు మాట్లాడుతూ.. రైతుల రికార్డుల ప్రకారం సరిచూసుకుని, లోపాలను సవరించాకే వెబ్ల్యాండ్లో భూముల వివరాలు నమోదు చేస్తున్నామని తెలిపారు. వివాదాలు వచ్చిన చోట ఇరువర్గాలతో మాట్లాడి ఆమోదయోగ్యమైతేనే వివరాలు నమోదు చేస్తున్నామన్నారు. భూ యజమానుల హక్కులకు భంగం కలిగేతే వెంటనే తనకు ఫిర్యాదు చేయాలన్నారు. రైతులు ముందుగా వారి భూములకు సంబంధించి విస్తీర్ణాలు, పాసు బుక్లో నమోదైన విస్తీర్ణాలు సరిచూసుకుని కంప్యూటరీకరణ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రైతులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. -
ఏటీఎంలో మంటలు : దగ్ధమైన నగదు
ఒంగోలు : ప్రకాశం జిల్లా పొదిలి బస్టాండ్ సమీపంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో గురువారం రాత్రి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని... మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బ్యాంకు అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఏటీఎంలో ఎంత నగదు కాలిపోయిందీ అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరెంట్ షాక్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా విచారణ చేపట్టారు. -
థియేటర్లో కరెంటు కట్ ... కుర్చీలు విరిగాయి
ఒంగోలు : రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందంటూ అభిమానులు ఎదురు చూశారు. ఆ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఎలాగో అలాగా అభిమానులు కష్టపడి సినిమా టికెట్లు సంపాదించి... థియేటర్లో బాహుబలి సినిమా చూస్తున్నారు. మంచి సన్నివేశం వస్తుండగా....ఒక్కసారిగా కరెంట్ పోయింది. దాంతో అభిమానులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే వారు రెచ్చిపోయారు. థియేటర్లోని కుర్చీలను విరగొట్టారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పొదిలిలోని హరికృష్ణ థియేటర్లో చోటు చేసుకుంది. దీంతో థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు థియేటర్ వద్దకు చేరుకున్నారు. దాదాపు 20 నిమిషాల తర్వాత కరెంట్ వచ్చింది. ఇంతలో అభిమానులు వెంటనే సినిమా వేయాలని డిమాండ్ చేయడంతో బాహుబలిని ప్రదర్శిస్తున్నారు. పోలీసులు వెను తిరిగారు. -
పదహారుమందిని కరిచేశాయి
పొదిలి : ప్రకాశం జిల్లా పొదిలిలో పిచ్చి కుక్కల దాడిలో 16 మందికి గాయాలయ్యాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి పొదిలి మేజర్ పంచాయతీ పరిధిలోని పొదిలి పట్టణంతోపాటు రాజుపాలెంలో మూడు పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. కనిపించిన వారిపై దాడి చేశాయి. వీటి దాడిలో 16 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన వారిని ఒంగోలులోని రిమ్స్కు, మిగిలిన వారిని పొదిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మూడు పిచ్చి కుక్కల్లో ఒక దానిని స్థానికులు కొట్టి చంపగా మిగతా రెండూ తప్పించుకుపోయాయి. -
సేఫ్ జర్నీ అందిస్తారు..
జిల్లాకు చెందిన ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు మూడు జిల్లాల్లో (జోన్) ఉత్తమ డ్రైవర్లుగా ఎంపికయ్యూరు. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా..అప్రమత్తంగా ఉండటంలో వారికి వారే సాటి. గతంలో కూడా ఎన్నో సార్లు ఉత్తమ డ్రైవర్లుగా ఎంపికైన వీరిద్దరూ 26వ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా మరింత గుర్తింపు పొందారు. ఇతనే.. బెస్ట్ డ్రైవర్ పొదిలి: తన్నీరు సుబ్బయ్య ఆర్టీసీ బస్సు స్టీరింగ్ పట్టుకుంటే ప్రయూణికులు సీట్లలో హాయిగా నిద్రపోతారు. ఇలా 32 సంవత్సరాలుగా సేవలందిస్తున్న తన్నీరు సుబ్బయ్య ప్రస్తుతం పొదిలి ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్నారు. కేవలం ఉత్తమ డ్రైవర్గానే కాకుండా.. ఇంధన పొదుపులోనూ తోటి వారికి ఆదర్శంగా నిలిచారు. అందుకే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఆర్టీసీ జోన్ పరిధిలో బెస్ట్ డ్రైవర్గా ఎంపికయ్యారు. తన సుదీర్ఘకాలం డ్రైవింగ్లో ఒక్క యూక్సిడెంట్ చేయకుండా అందరి ప్రశంసలందుకుంటున్నారు. సుబ్బయ్య స్వగ్రామం కొనకనమిట్ల మండలం చినమనగుండం. ఆర్టీసీ బస్సును ఎంత భద్రంగా కాపాడతారో తన కుటుంబాన్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటారనే పేరు చుట్టుపక్కల పల్లెల్లో ఉంది. 1980లో డ్రైవర్గా చేరి మూడు సంవత్సరాల పాటు ఒంగోలు-గిద్దలూరు ప్రైవేటు బస్సు సర్వీస్ను నడిపారు. 1983లో ఆర్టీసీ డ్రైవర్గా ఎంపికయ్యారు. హైదరాబాదు, బెంగళూరు, నె ల్లూరు వంటి దూరపు సర్వీసులు నడపాలంటే ముందుగా సుబ్బయ్య పేరు గుర్తుకొస్తుంది. ఏ డిపోలో ఏ సర్వీస్కు పనిచేసినా, జీరో యాక్సిడెంట్ అతని సర్వీస్ రికార్డు. ఇప్పటి వరకు డిపో, జిల్లా, రీజియన్, జోనల్ స్థాయిలో పలు అవార్డులు అందుకున్నారు. ఈయన భార్య అనసూర్య పొలం పనులు చేస్తుంది. మొదటి కుమారుడు వెంకటేశ్వర్లు ఇంటి వద్దనే ఉంటుండగా.. రెండో కుమారుడు శ్రీనివాసులు మలేషియాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. మూడో అబ్బారుు రాంబాబు ఎంసీఏ పూర్తి చేసి ఫార్మాస్యూటికల్స్లో ఉద్యోగం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉంటా: సుబ్బయ్య దేవుని దయవల్ల సర్వీస్ కాలంలో ఎక్కడా ఎటువంటి ప్రమాదం కాలేదు. ప్రశాంతంగా బస్సు నడపటమే ఏకైక విజయ రహస్యం. శిక్షణ, కౌన్సెలింగ్ సమయంలో నిపుణులు చెప్పే విషయాలను పాటించాలి. నాలుగైదు నెలల్లో రిటైర్డ్ అవుతా. అప్పటివరకు జాగ్రత్తగా ఉండాలి. బాషా డ్రైవ్ చేస్తే.... కందుకూరు: దురలవాట్లకు దూరంగా ఉంటూ ప్రయూణికులను సురక్షితంగా గమ్య స్థానానికి చేర్చాలనే తపన కందుకూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్కే మహబూబ్ బాషాకు పుష్కలంగా ఉంది. అందుకే ఇప్పటికి 11సార్లు ఉత్తమ డ్రైవర్గా అవార్డులందుకున్నారు. 1985లో విధుల్లో చేరిన ఈయన దాదాపు 29 సంవత్సరాల సర్వీసు కాలంలో ఇప్పటికీ చిన్న ప్రమాదాన్ని కూడా చేయలేదు. బాషా నైపుణ్యాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ‘నేను సిగరెట్, కిళ్లీ, గుట్కా వంటి వాటికి దూరంగా ఉంటా. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఉపయోగించను. కానీ ఈ మధ్య కాలంలో చాలామంది ఆర్టీసీ డ్రైవర్లు సెల్ఫోన్ నడుపుతూ డ్రైవింగ్ చేస్తుండటం బాధాకరం. నడిపేటప్పుడు సెల్ఫోన్ వాడకాన్ని నిషేధించాలి. పదుల సంఖ్యలో ప్రాణాలు నా చేతుల్లో ఉన్న విషయూన్ని ఎప్పటికీ మరవను. -
కుటుంబాన్ని బలి తీసుకున్న బస్సు!
ఒంగోలు: రోడ్డు ప్రమాదంలో ఒక కుటుంబంలోని నలుగురు దుర్మరణం చెందారు. పొదిలి అగ్రహారం వద్ద రిక్షాను ఆర్టీసి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిక్షాలో వెళుతున్న నలుగురూ మృతి చెందారు. మృతులు అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. మరణించినవారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ** -
కారు మబ్బు కమ్మేసింది
పొదిలి : పత్తిపొలంలో కలుపు తీసేందుకు వెళ్లిన ముగ్గురు మహిళా కూలీలు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన మండలంలోని మాదాలవారిపాలెంలో సోమవారం జరిగింది. ప్రమాదంలో గ్రామానికి చెందిన దామరెడ్డి సాయమ్మ(60), కాపులపల్లి రామసుబ్బులు(50), పోతల ధనమ్మ(30) ప్రాణాలు కోల్పయారు. ఎస్సై నాగమల్లేశ్వరరావు,తహశీల్దార్ పి.విద్యాసాగరుడు వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ట్రాక్టర్లో పొదిలి తరలించారు. ఆ ఇంటికి సాయమ్మే దిక్కు కూలి పనికి పోతేనే సాయమ్మ కుటుంబం గడిచేది. ఆమె భర్త పని చేయలేడు. ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలకు వివాహాలు జరిగి అంతా ఎవరిదారిన వారు వెళ్లారు. పెద్ద కొడుకు ఏమయ్యాడో కూడా తెలియదు. ఆరోగ్యం బాలేదంటే ఇంటి వద్దే ఉండమన్నా వినకుండా పనికి వెళ్లి కనిపించకుండా పోయిందని సాయమ్మ భర్త దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నాడు. బిక్కుబిక్కుమంటున్న పిల్లలు ధనమ్మ,పుల్లయ్య దంపతులు కూలి పనులకు వెళ్తేనే కుటుంబం గడిచేది. ముగ్గురు కుమారులను బడికి పంపుతున్నారు. వారికి ఏలోటూ రాకుండా చూస్తున్నారు. పాఠశాలలో ఉండగానే సమాచారం అందటంతో ఇంటికి చేరిన పిల్లలు వీరబ్రహ్మం, ఈశ్వర్, వీరాంజనేయులు తల్లి ధనమ్మ మృతదేహం వద్ద బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. పని చేస్తూ.. చేయిస్తూ... కాపులపల్లి రామసుబ్బులు అనే మహిళ తమ సొంత పొలంలో పనిచేస్తూనే పిడుగుపాటుకు ప్రాణాలొదిలింది. కూలీలతో పనులు చేయిస్తూ, తాను కూడా వారితో కలిసి పనిచేస్తూ కలివిడిగా ఉండేది. రామసుబ్బులుకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన పొలంలో పనిచేస్తూ కూలీలు చనిపోవటం బాధగా ఉందని రామసుబ్బులు భర్త వెంకటరెడ్డి అలియాస్ శివరాజ్ హృదయవిదారకంగా రోదిస్తున్నాడు. అమ్మా.. లేమ్మా! రామసుబ్బులు తోడుకోడలు కుమార్తె అశ్విని. తండ్రి చనిపోయినప్పటి నుంచి పెద్దమ్మ రామసుబ్బులు, పెద్దనాన్న శివరాజ్ల సంరక్షణలో పెరుగుతోంది. రామసుబ్బులను ఎప్పుడూ పెద్దమ్మా అని పిలవదు. అమ్మా అని మాత్రమే పిలిచేది. తనను గారాబంగా చూసుకునే అమ్మ విగతజీవై ట్రాక్టర్లో అచేతనంగా పడి ఉండటాన్ని చూసి అశ్విని బిగ్గరగా రోదిస్తోంది. మృతదేహాన్ని తట్టి లేపుతూ అమ్మా ఒక్కసారి లేమ్మా అంటూ రోదిస్తున్న అశ్వినిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. అండగా ఉంటా : ఎమ్మెల్యే జంకె సంఘటన జరిగిన సమయంలో తహ శీల్దార్ కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి హుటాహుటిన మాదాలవారిపాలెం చేరుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఎంపీపీ కోవెలకుంట్ల నరసింహారావు, జెడ్పీటీసీ సభ్యులు సాయి రాజేశ్వరరావు, రావి భాషాపతిరెడ్డి, నాయకులు గొలమారి చెన్నారెడ్డి, వాకా వెంకటరెడ్డి, ఓంకార్, పి.శ్రీనివాసులు, బాలవెంకటేశ్వర్లు, గుంటూరు పిచ్చిరెడ్డి, మీగడ ఈశ్వరరెడ్డి, దోర్నాల చిన్ననారాయణరెడ్డి తదితరులు వచ్చి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
రక్తదానంలో ‘పొదిలి’ వాసులు ఆదర్శం
పొదిలి : రక్తదానం చేసి ఆపదలో ఉన్న ప్రాణాలు కాపాడడంలో తామే ముందుంటామని మండల వాసులు నిరూపించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎంపీడీఓ జీవీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది. సుమారు 270 మంది రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారు. రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంకు ప్రతినిధులు ఆ మేరకు సిద్ధం కాకపోవడంతో 190 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి శిబిరాన్ని సందర్శించి, రక్తదాతలకు పండ్లు పంపిణీ చేశారు. మంచి కార్యక్రమం నిర్వహించారంటూ ఎంపీడీఓని అభినందించారు. జిల్లాలో ఎప్పుడూ ఇంత స్పందన రాలేదని బ్లడ్ బ్యాంకు డాక్టర్ పి.సత్యనారాయణ చెప్పారు. స్టెప్ అధికారి శ్రీమన్నారాయణ శిబిరాన్ని పర్యవేక్షించారు. రక్తదాతలకు ఎంపీడీఓ అభినందనలు తెలిపారు. పండ్ల వ్యాపారుల సంఘ అధ్యక్షుడు షేక్ సుభాని, వైఎస్ఆర్ సీపీ నాయకులు వాకా వెంకటరెడ్డి, టీడీపీ నాయకులు గునుపూడి భాస్కర్ రక్తదాతలకు పండ్లు, రొట్టెలు, జ్యూస్, బిస్కట్లు అందచేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కోవెలకుంట్ల నరసింహారావు, జెడ్పీటీసీ సభ్యుడు సాయి రాజేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్వలి, సీడీపీఓ రేచల్ సరళ, ఈఓఆర్డీ జి.నాగేశ్వరరావు, క్రిష్ణయ్య, వైఎస్ఆర్ టీఎఫ్ జిల్లా నాయకులు సానికొమ్ము జగన్మోహనరెడ్డి, ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు నారు శ్రీనివాసరెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జి.శ్రీనివాసులు, కల్లం సుబ్బారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, రాచమల్ల వెంకటరామిరెడ్డి, కంచర్ల శ్రీనివాసులు, పులి వెంకటేశ్వరరెడ్డి, కె.చిన్న సోమయ్య పాల్గొన్నారు. -
పోలీస్స్టేషన్ ఆవరణలో తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం
పొదిలి, న్యూస్లైన్: పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ పోలీస్స్టేషన్ ఆవరణలోనే తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన పొదిలి పట్టణంలో మంగళవారం జరిగింది. ఆ వివరాల ప్రకారం... వడ్లమాని గురుబ్రహ్మం, సుశీల దంపతులకు కుమార్తె రాజ్యం, కుమారుడు వీరబ్రహ్మం సంతానం. వీరు స్థానిక చిన్నబస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్నారు. కాగా, దాసరిగడ్డకు చెందిన చెన్నంశెట్టి ఉమామహేశ్వరి అనే మహిళ.. సుశీల కుటుంబానికి కొంత నగదును అప్పుగా ఇచ్చింది. ఆ అప్పు తిరిగి ఇవ్వాలని కోరగా సుశీల కుటుంబ సభ్యులు తనపై దాడిచేశారంటూ చెన్నంశెట్టి ఉమామహేశ్వరి ఇటీవల స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు ఈ నెల 9వ తేదీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న సుశీల, ఆమె కుమార్తె రాజ్యంను మంగళవారం పోలీస్స్టేషన్కు పిలిపించారు. తమను కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలుసుకున్న వారిద్దరూ.. పోలీసులు తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ తమవెంట తెచ్చుకున్న పురుగుమందు సేవించి పోలీస్స్టేషన్ ఆవరణలోనే ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన పోలీసులు వెంటనే 108లో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. మహిళల మధ్య జరిగిన చిన్నపాటి గొడవను పోలీసులు పెద్దదిగా భావించి కేసు నమోదు చేసి తనను, తన కుమార్తెను బజారుకీడ్చి ఇబ్బంది పెడుతున్నారంటూ సుశీల ఆరోపించారు. పది రోజులుగా పోలీస్స్టేషన్ చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశాం... చెన్నంశెట్టి ఉమామహేశ్వరి అనే బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకే తాము సుశీల కుటుంబంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగమల్లీశ్వరరావు వెల్లడించారు. ఆ మేరకు వారిని పిలిచి విచారిస్తున్నామన్నారు. మంగళవారం వారు వచ్చిన సమయంలో తాను విద్యుత్ కార్యాలయం వద్దకు వెళ్తున్నానని, 10 నిముషాల్లో వస్తానని వారితో కూడా చెప్పి వెళ్లానని, ఈలోగా వారు పురుగుమందు సేవించారని వివరించారు. సిబ్బంది సమాచారం ఇవ్వగా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు.