థియేటర్లో కరెంటు కట్ ... కుర్చీలు విరిగాయి | power cut in hari krishna theatre in podili | Sakshi
Sakshi News home page

థియేటర్లో కరెంటు కట్ ... కుర్చీలు విరిగాయి

Jul 10 2015 1:15 PM | Updated on Aug 29 2018 1:16 PM

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందంటూ అభిమానులు ఎదురు చూశారు. ఆ చిత్రం శుక్రవారం విడుదలైంది.

ఒంగోలు :  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందంటూ అభిమానులు ఎదురు చూశారు. ఆ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఎలాగో అలాగా అభిమానులు కష్టపడి సినిమా టికెట్లు సంపాదించి... థియేటర్లో బాహుబలి సినిమా చూస్తున్నారు. మంచి సన్నివేశం వస్తుండగా....ఒక్కసారిగా కరెంట్ పోయింది.

దాంతో అభిమానులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే వారు రెచ్చిపోయారు. థియేటర్లోని కుర్చీలను విరగొట్టారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పొదిలిలోని హరికృష్ణ థియేటర్లో చోటు చేసుకుంది. దీంతో థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు థియేటర్ వద్దకు చేరుకున్నారు. దాదాపు 20 నిమిషాల తర్వాత కరెంట్ వచ్చింది. ఇంతలో అభిమానులు వెంటనే సినిమా వేయాలని డిమాండ్ చేయడంతో బాహుబలిని ప్రదర్శిస్తున్నారు. పోలీసులు వెను తిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement