
అంతర్జాతీయ యోగా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
జనగామ: అంతర్జాతీయ 11వ యోగా ఉత్సవాలను పురస్కరించుకుని ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ను కలెక్టర్ రిజ్వాన్ బాషా మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ మల్లికార్జునరావుతో కలిసి ఆయన మాట్లాడారు. నిత్యందన జీవితంలో ప్రతీరోజు యోగా, ధ్యానంతో మానసిక ప్రశాంత, ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడంతో పాటు ఉల్లాసంగా ఉండవచ్చన్నారు. ఈ నెల 21వ తేదీన మినీ స్టేడియంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రజలు, జిల్లా అధికారులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అశోక్ కుమార్, జిల్లా అధికారి డాక్టర్ మమత, డీపీఎం కుమార్ పాల్గొన్నారు.