రుచికరమైన భోజనం అందించాలి | - | Sakshi
Sakshi News home page

రుచికరమైన భోజనం అందించాలి

Jun 11 2025 8:58 AM | Updated on Jun 11 2025 8:58 AM

రుచికరమైన భోజనం అందించాలి

రుచికరమైన భోజనం అందించాలి

రఘునాథపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలని జిల్లా విద్యాశాఖాధికారి భోజన్న సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో కాంప్లెక్స్‌ పరిధిలోని హెచ్‌ఎంలకు, మధ్యాహ్న భోజన నిర్వాహకులకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు మోనూ ప్రకారం అందించే మధ్యాహ్న భోజనంలో ఉపయోగించే వస్తువుల క్వాలిటీని క్షుణ్ణంగా పరిశీలించి శుభ్రతగా తయారు చేసి వడ్డించాలన్నారు. భోజనం తయారు చేసే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రఘునందన్‌రెడ్డి, ఆర్‌పీ అంకం రవీందర్‌, హెచ్‌ఎం రమేష్‌, సీఆర్‌పీ కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

జిల్లా విద్యాశాఖాధికారి భోజన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement