నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

May 31 2025 1:12 AM | Updated on May 31 2025 1:12 AM

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

డీసీపీ రాజమహేంద్రనాయక్‌

పాలకుర్తి టౌన్‌: నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్‌ హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలో ని పలు ఎరువులు, పురుగుల మందు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆయన.. సరుకు నాణ్యతా ప్రమాణాలు, స్టాక్‌ రిజిస్టర్‌, బిల్‌బుక్‌ నిర్వహణ తదితరాలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. రైతులు నాసిరకం విత్తనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరికై నా అనుమానం వస్తే వెంటనే వ్యవసాయ విభాగానికి సమాచారం ఇవ్వాలని సూచించారు. తనిఖీలో ఏసీపీ అంబటి నర్సయ్య, వ్యవసాయ అధికారులు రామారావు, పరుశురాంనాయక్‌, ఏఓ శరత్‌చంద్ర, ఎస్సై దూలం పవన్‌కుమార్‌, లింగా రెడ్డి, పీఎస్సై రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement