
‘బెస్ట్ ప్రాక్టీస్’ రాష్ట్ర సదస్సుకు ఎంపిక
మెమోరీ గేమ్స్లో..
గణితంతో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా బోధన. పిల్లవాడి మెమోరీ పవర్ను అర్థం చేసుకుని, అందుకు తగ్గట్టుగా లెక్కల పాఠాలు బోధించడంలో పాటించిన పద్ధతులను రాష్ట్ర స్థాయి సదస్సుకు ఎంపికయ్యేలా చేసింది.
– కె.శిరీషరాణి, టీజీటీ మ్యాథ్స్,
మోడల్ స్కూల్, కొడకండ్ల
జనగామ: సర్కారు బడుల్లో విద్యాబోధనలో మరి న్ని మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యే క దృష్టి సారించింది. విద్యార్థుల బంగారు భవిష్య త్, బడుల అభివృద్ధికి శ్రమిస్తున్న ఉపాధ్యాయులపై ఫోకస్ సారించారు. ఉత్తమ విధానాలను ఎంపిక చే సుకుని పేద విద్యార్థులకు నాణ్యమైన బోధన అంది స్తున్న జిల్లాలోని ఐదుగురు ఉపాధ్యాయులను రాష్ట్ర స్థాయి (బెస్ట్ ప్రాక్టీస్) సదస్సుకు ఎంపిక చేసింది.
నేటి నుంచి సదస్సు
హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో నేటి (బుధవారం) నుంచి విద్యాస్థాయి ప రిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో సదస్సు ప్రారంభం కానుంది. నూతన అభ్యసన ప్రక్రియకు సంబంధించి ఉత్తమ ప్రదర్శనలకు ఎంపికై న వాటిని రాష్ట్ర స్థాయికి పంపిస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఉ న్నతాధికారుల సమక్షంలో ప్రదర్శించనున్నారు.
వినూత్న పద్ధతులు
విద్యార్థుల్లో కొత్తదనం నింపడం, వినూత్న పద్ధతుల ద్వారా బోధన. విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ స్కూల్లో బ్యాంకు నిర్వహణ తదితర అంశాలు రాష్ట్ర స్థాయి సదస్సుకు ఎంపికయ్యేలా చేశాయి.
– డి.వెంకటేశ్వర్లు, స్కూల్ అసిస్టెంట్,
సోషల్, జెడ్పీఎస్ఎస్, చిల్పూర్
చదువుపై ఆసక్తి కల్పించడం..
వినూత్న పద్ధతులను అవలంభిస్తూ బోధించడం. క్వాలిటీ బోధన అందించే క్రమంలో విద్యార్థులకు చక్కటి మెళకువలను నేర్పించడం. చదువుపై ఆసక్తి కలిగించడం.
– ఎం.పద్మారాణి, పెద్దమడూరు,పీఎస్, దేవరుప్పుల
జిల్లా నుంచి హాజరుకానున్న
ఐదుగురు ఉపాధ్యాయులు

‘బెస్ట్ ప్రాక్టీస్’ రాష్ట్ర సదస్సుకు ఎంపిక

‘బెస్ట్ ప్రాక్టీస్’ రాష్ట్ర సదస్సుకు ఎంపిక

‘బెస్ట్ ప్రాక్టీస్’ రాష్ట్ర సదస్సుకు ఎంపిక