కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

Jun 7 2025 1:26 AM | Updated on Jun 7 2025 1:26 AM

కార్మ

కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు

జనగామ రూరల్‌: కార్మికులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు అన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్‌, మెప్మా సంయుక్త ఆధ్వర్యాన శుక్రవారం స్థానిక మున్సిప ల్‌ కార్యాలయంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది తరచూ దుమ్ము, ధూళి ఇతర కాలుష్యం బారిన పడుతుంటారని, వారి ఆరోగ్య రక్షణకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు, స్వయం సహాయ క గ్రూపు సభ్యులు, మున్సిపల్‌ సిబ్బంది రక్తనమూనాలు సేకరించి తెలంగాణ డయాగ్నొస్టిక్‌ హబ్‌ ద్వారా పరీక్షలు నిర్వహించారు. రిపోర్టుల ఆధారంగా వైద్యం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ పి.వెంకటేశ్వర్లు, ప్రత్యేక వైద్య నిపుణులు పాల్గొన్నారు.

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

జనగామ రూరల్‌: మహిళలు ప్రభుత్వం అందజేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని డీఆర్డీఓ వసంత అన్నారు. శుక్రవారం సెర్ప్‌, భారత ప్రభుత్వం పారిశ్రామిక మంత్రిత్వ శాఖ, తెలంగాణ పారిశ్రామిక శాఖ సంయుక్తంగా ఆలిప్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యాన నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళలు వ్యాపారవేత్తలుగా రాణించేందుకు శిక్షణ పొందాలని, ముఖ్యంగా టైలరింగ్‌, పేపర్‌ ప్లేట్స్‌, ఆహార ఉత్పత్తుల తయారీ వంటి వాటిల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల అధికారి శివరామకృష్ణ, డీపీఎం రాజేంద్రప్రసాద్‌, ఏపీఎం జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
1
1/1

కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement