విశేష అలంకరణలో వేంకటేశ్వరస్వామి | - | Sakshi
Sakshi News home page

విశేష అలంకరణలో వేంకటేశ్వరస్వామి

Jun 7 2025 1:26 AM | Updated on Jun 7 2025 1:26 AM

విశేష

విశేష అలంకరణలో వేంకటేశ్వరస్వామి

చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి శుక్రవారం విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చా రు. ఉదయం ఆల య ఈఓ లక్ష్మీప్రస న్న, చైర్మన్‌ శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు ప్రత్యేక పూజల చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

పనులు వేగవంతం చేయాలి

జనగామ రూరల్‌: బతుకమ్మకుంట పనులు వేగంగా చేపట్టాలని అదనపు కలెక్టర్‌ పింకేష్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని బతుక మ్మ కుంట అభివృద్ధి పనులను మున్సిపల్‌ అధికారులతో కలిసి సందర్శించిన ఆయన పలు సూచనలు చేశారు. వర్షాకాలం సమీపిస్తున్నందున పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పా రు. పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో తెలియజేయాలని సూచించారు.

బీఆర్‌ఎస్‌ హయాంలోనే

చేనేత రంగం పురోగతి

దేవరుప్పుల : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో నే తెలంగాణంలో చేనేత రంగం పురోగతికి అడుగులు పడ్డాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన అమెరికా డల్లాస్‌లో తెలంగాణ పద్మశాలీలతో ఎంఎల్‌సీ రమణతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించగా ఎన్‌ఆర్‌ఐలు ఎర్రబెల్లిని సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సాధన ఉద్యమ నేపథ్యంలో నేతన్నల కష్టం తెలిసిన కేసీఆర్‌ ఆచరణాత్మకంగా చేనేత మిత్ర, నేతన్న కు చేయూత పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. వరంగల్‌, సిరిసిల్లలో టెక్స్‌టైల్‌ పార్క్‌లు తీసుకువచ్చి నిరుద్యోగులకు ఊరట కల్పించార ని, కొడకండ్లలోనూ మినీ టెక్స్‌టైల్‌ పార్క్‌ మంజూరు చేయించినట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా ఎన్‌ఆర్‌ఐలు తోడ్పాటు ఇవ్వ డం అభినందనీయమన్నారు.

మహిళా సంఘాల పాత్ర కీలకం

లింగాలఘణపురం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడంలో మహిళా సంఘాల పాత్ర ఎంతో కీలకమని డీఈఓ భోజన్న అన్నా రు. శుక్రవారం నెల్లుట్లలో జరిగిన ‘బడిబాట’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను ప్రజలకు వివరించి వారి పిల్లలు స్కూళ్లలో చేరే విధంగా చూడాలని కోరారు. జీసీడీఓ గౌషియాబేగం, ఎంఈఓ విష్ణుమూర్తి, హెడ్మాస్టర్లు శ్రీలత, సమ్మ క్క తదితరులు పాల్గొన్నారు.

‘పార్ట్‌టైం’ నియామకం

జనగామ: ప్రభుత్వ పాఠశాలల్లో 2025–26 సంవత్సరం కాంట్రాక్టు పద్ధతిలో పని చేయడానికి పార్ట్‌టైం(పీటీఐ) బోధకుల నియామకానికి సర్కారు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమికోన్నత, ఉన్నత, మోడల్‌ స్కూళ్లతో పాటు భవిత కేంద్రాల్లో హెల్త్‌, ఫిజికల్‌, ఆర్ట్‌, వర్క్‌ ఎడ్యుకేషన్‌ బోధకుల సేవలను పునఃప్రారంభిచనున్నారు. జిల్లాలో గత ఏడాది 55 మంది పార్ట్‌టైం బోధకులు పనిచేయగా.. ప్రతీ ఏడా ది ఏప్రిల్‌లో కాలపరిమితి ముగుస్తుంది. వచ్చే విద్యా సంవత్సరంలో పనిచేయడానికి గత ఏడా ది చివరి నెల వేతనంతో నియమించనున్నారు.

బెస్ట్‌ అవైలబుల్‌ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

జనగామ రూరల్‌: బెస్ట్‌ అవైలబుల్‌ పథకం కింద అడ్మిషన్ల కోసం గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరా నికి 3,5,8వ తరగతిలో ప్రవేశానికి జిల్లాలోని గిరిజన విద్యార్థులు అర్హులని, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతం 1,50,000, పట్టణ ప్రాంతం రూ.రెండు లక్షల లోపు ఉండాలని పేర్కొన్నారు. ఈనెల 9 నుంచి 13 వరకు హనుమకొండలోని జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని, 20న లాటరీ పద్ధతిలో ఎంపిక ఉంటుందని తెలిపారు.

విశేష అలంకరణలో వేంకటేశ్వరస్వామి
1
1/1

విశేష అలంకరణలో వేంకటేశ్వరస్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement