సర్కారు స్కూళ్లకు పూర్వవైభవం తేవాలి | - | Sakshi
Sakshi News home page

సర్కారు స్కూళ్లకు పూర్వవైభవం తేవాలి

Jun 7 2025 1:26 AM | Updated on Jun 7 2025 1:26 AM

సర్కారు స్కూళ్లకు పూర్వవైభవం తేవాలి

సర్కారు స్కూళ్లకు పూర్వవైభవం తేవాలి

దేవరుప్పుల : సర్కారు స్కూళ్లకు పూర్వవైభవం తేవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. శుక్రవారం సింగరాజుపల్లిలో నిర్వహించిన ‘బడిబాట’ ర్యాలీ ప్రారంభించి కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలోని శివాలయ నిర్మాణ భూమి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ రంగాల్లో రాణించాలన్నా విద్య అత్యంత ప్రధానమని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద కనీస వసతులు మెరుగుపర్చి ప్రాథమిక, ఉన్నత విద్య బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంఈఓ జి.కళావతి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నల్ల శ్రీరామ్‌, హెచ్‌ఎం సూచిత్రానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement