శనివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2025
– 10లోu
జనగామ: నిధులున్నాయి.. పనులు పూర్తి కాగానే డబ్బులు బ్యాంకులో జమవుతున్నాయి.. అయినా అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చివరి దశ పనులన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. తరగతి గదులకు కిటికీలు అమర్చలేదు.. మరుగుదొడ్లకు తలుపులు బిగించలే దు.. విద్యుత్ వైరింగ్, టాయిలెట్ల నిర్మాణం, ప్రహరీలు, రంగుల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. పాఠశాలలు మరో ఐదు రోజుల్లో పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనుల పురోగతిపై ‘సాక్షి’ పరిశీలనాత్మక కథనం.
జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కింద 320 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. తరగతి గదుల్లో బోధనకు అవసరమైన పరికరాలతో పాటు కనీస మౌలిక వసతుల కల్పనకు గత ఏడాది ఏప్రిల్లో రూ.11.75 కోట్ల నిధులకు అడ్మిన్ సాంక్షన్ ఇచ్చారు. ఇందులో 12 పాఠశాలల్లో నూత న టాయిలెట్ల నిర్మాణానికి ఇటీవలే గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. మొత్తం 1,125 పనులకు ఇప్పటి వరకు 950 పూర్తయ్యాయి. రూ.9.25 కోట్ల మేర నిధులు చెల్లించారు. 250 పాఠశాలల్లో వందశాతం పనులు పూర్తికాగా.. జిల్లాలో మరో 63 పాఠశాలలకు ఈ స్కీంలో అవకాశం కల్పించాలని ఇటీవల అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ ప్రభుత్వానికి నివేదించారు.
కమిటీ నిర్లక్ష్యం.. పనులకు ఆటంకం
నర్మెట: గండిరామారం ప్రాథమికోన్నత, వెల్దండ ఉన్నత పాఠశాలల్లో విద్యుత్ వైరింగ్ పని పెండింగ్లో ఉంది. టాయిలెట్లకు తలుపులు బిగించలేదు. నిధుల కొరత లేకున్నా కమిటీ నిర్లక్ష్యంతో పనులకు ఆటంకం కలుగుతోంది. పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల చదువులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.
ఇబ్బంది లేకుండా చేస్తాం..
పాఠశాలలు తెరుచుకునే లోపు అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు పెండింగ్ లేకుండా చేస్తాం. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. తాగునీటి వసతులు, టాయిలెట్ల పనులు వందశాతం పూర్తి చేయిస్తాం.
– మడిపల్లి ఐలయ్య, ఎంఈఓ
కిటికీ లేని తరగతి గది
బచ్చన్నపేట : పై ఫొటోలో కనిపిస్తున్న పాఠశాల బచ్చన్నపేట మండలం గోపాల్నగర్ పీఎస్. ఇందులో ఒకటి నుంచి 5 తరగతులు ఉన్నాయి. 27 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. కొత్త అడ్మిషన్లు కొన్ని పెరగనున్నాయి. ఏడాది క్రితం ఈ స్కూల్ అమ్మ ఆదర్శ పాఠశాల స్కీంకు ఎంపికై యింది. మరమ్మతు, టాయిలెట్లు, టైల్స్ ఇతర మైనర్ పనుల కోసం రూ.2.11లక్షల నిధులకు అడ్మిన సాంక్షన్ ఇచ్చారు. మరుగుదొడ్డిలో టైల్స్, తరగతి గదులకు కిటికీల బిగింపు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. తరగతి గదిలోని డిజిటల్ బోర్డు, బెంచీలు, కుర్చీలకు రక్షణ లేదు.
పనులు పూర్తి చేయిస్తాం..
90 శాతం పనులు పూర్తయ్యాయి. మైనర్ పనులు పెండింగ్లో ఉన్నాయి. పాఠశాలల పునఃప్రారంభం లోపు వందశాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.
– మడిశెట్టి కృష్ణమూర్తి, హెచ్ఎం
న్యూస్రీల్
గ్రౌండ్ రిపోర్ట్
’అమ్మ ఆదర్శ పాఠశాల’ పథకం కింద జిల్లాలో 320 స్కూళ్ల ఎంపిక
వందశాతం పనులు పూర్తయిన
పాఠశాలలు 250
రూ.9.25 కోట్ల మేర నిధుల చెల్లింపులు
బడుల పునఃప్రారంభానికి మిగిలింది ఐదు రోజులే..
మైనర్ పనులే పెండింగ్
మైనర్ పనులే పెండింగ్
మైనర్ పనులే పెండింగ్
మైనర్ పనులే పెండింగ్
మైనర్ పనులే పెండింగ్