
ఆయిల్ పామ్ సాగుతో స్థిరాదాయం
బచ్చన్నపేట : ఆయిల్ పామ్ తోటల సాగుతో స్థిరాదాయం పొందవచ్చని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయిల్ పామ్ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 3,500 ఎకరాల సాగు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు 2వేల మంది రైతులు సుమారు 7వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని, 45 మంది రైతులు 1,716 ఎకరాల భూమిని గుర్తించినట్లు పేర్కొన్నా రు. ఈ పంటకు వడగళ్ల వర్షం, కోతులతో సమస్య ఉండదని, ఉద్యానవన అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కలిగించాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యానవన అధికారి రవికాంత్, ఫీల్డ్ ఆఫీసర్ శశి తదితరులు పాల్గొన్నారు.
ఆర్ఓఆర్తో భూసమస్యలకు పరిష్కారం
బచ్చన్నపేట/నర్మెట : భూ భారతి చట్టంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్ఓఆర్ చట్టంతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం బచ్చన్నపేట మండలం కొన్నె, నర్మెట మండలం వెల్దండ గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను పరిశీలించారు. రైతుల దరఖాస్తులను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సదస్సులో అన్ని రకాల భూసమస్యలకు దరఖాస్తు చేసుకోవచ్చని, రెవెన్యూ సిబ్బంది దగ్గరుండి సహా యం అందించాలని చెప్పారు. కార్యక్రమాల్లో ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్లు ఫణికిషోర్, కలకుంట్ల వెంకట రామానుజాచార్యులు, డీటీలు స్రవంతి, వేణు, ఎంఆర్ఐ కృష్ణవంశీ, ఏఆర్ఐ మున్వర్, జూనియర్ అసిస్టెంట్లు యాకయ్య, సర్వేయర్ నర్మద, రజిత, గంగాస్వప్న, కవిత, రాజశ్రీ పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా