మోదీ నాయకత్వంలోనే అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

మోదీ నాయకత్వంలోనే అభివృద్ధి

Jun 7 2025 1:34 AM | Updated on Jun 7 2025 1:34 AM

మోదీ నాయకత్వంలోనే అభివృద్ధి

మోదీ నాయకత్వంలోనే అభివృద్ధి

జనగామ రూరల్‌: మోదీ నాయకత్వంలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిరికొండ విద్యాసాగర్‌ రెడ్డి అన్నారు. ‘నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలన’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యాన కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమాని కి మోదీ చేసిన అభివృద్ధి పనులు అనేకం ఉన్నాయ ని, తెలంగాణ అభివృద్ధికి పాటుపడింది బీజేపీ మాత్రమే అన్నారు. రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా పట్టణ కమిటీని నియమించారు. అధ్యక్షుడిగా బొమ్మకంటి అనిల్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శిగా పెద్దోజు జగదీశ్‌, ఉపాధ్యక్షులుగా తోకల హరీశ్‌, బింగి రమేశ్‌, సూరజ్‌ హరిప్రసాద్‌, గోగీకర్‌ బాలా జీ, నాగ బండి సరిత, కార్యదర్శులుగా దూసరి శివకృష్ణ, ఏగుర్ల భాస్కర్‌, కాసుల నీలిమ, పాయల వెంకటలక్ష్మి, ట్రెజరర్‌గా గుజ్జుక రాజు ఎంపికయ్యారు. ఇదిలా ఉండగా.. మండల కమిటీ ఆధ్వర్యాన అధ్యక్షుడు లద్దునూరి మహేశ్‌ యాదవ్‌ నేతృత్వంలో స్థానిక వికాస్‌ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు దేవరాయ ఎల్లయ్య, మార్క ఉపేందర్‌, బండారి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement