విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

Jun 4 2025 1:13 AM | Updated on Jun 4 2025 1:13 AM

విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

జనగామ రూరల్‌: నెట్‌వర్క్‌, టీవీ కేబుల్స్‌ ద్వారా విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్‌ఈ వేణుమాధవ్‌ అన్నారు. మంగళవారం జనగామ డివిజన్‌ పరిధిలోని ఏడు మండలాలు బచ్చన్నపేట, లింగాలఘణపురం, రఘునాథపల్లి, నర్మెట, తరిగొప్పుల, దేవరుప్పుల, జనగామ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కేబుల్‌ టీవీ ఆపరేటర్స్‌, ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ ఆపరేటర్స్‌, డిస్ట్రిబ్యూటర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెగిపోయిన కేబుల్‌ తీసేసి కొత్త కేబుల్‌ వేయాలని, గాలిలో వేలాడకుండా చూడాలన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న కేబుల్‌ వైర్లను సరిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఈ ఆపరేషన్‌ లక్ష్మీ నారాయణ రెడ్డి, డీఈ టెక్నికల్‌ గణేష్‌, జయరాజు , ఏడీలు, ఏఏఓ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement