
పాలకుల నిర్లక్ష్య వైఖరి వీడాలి
దేవరుప్పుల: వ్యవసాయ రంగ పురోగతిపై పాలకుల నిర్లక్ష్య వైఖరి వీడాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్ తెలిపారు. మంగళవారం మండలకేంద్రంలో సీపీఐ(ఎం) జిల్లా స్థాయి శిక్షణా తరగతుల సందర్భంగా పార్టీ జెండాను జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సింగారపు రమేష్ ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎండీ అబ్బాస్ మాట్లాడుతూ రైతులకు పత్తి విత్తనాలు, ఎరువులు అందుబాటులేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్, జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు ఇర్రి అహల్య, సాంబరాజు యాదగిరి, రాయపర్తి రాజు, సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్