విద్యుత్‌ ప్రమాదాలను నివారించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ప్రమాదాలను నివారించాలి

May 1 2025 1:11 AM | Updated on May 1 2025 1:11 AM

విద్యుత్‌ ప్రమాదాలను నివారించాలి

విద్యుత్‌ ప్రమాదాలను నివారించాలి

హన్మకొండ: విద్యుత్‌ ప్రమాదాలను నివారించాలని టీజీ ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నా టి వరుణ్‌ రెడ్డి అన్నారు. బుధవారం మే 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్న విద్యుత్‌ భద్రతా వారోత్సవాల వాల్‌ పోస్టర్లు, కరపత్రాలను సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, ఇన్‌చార్జ్‌ డైరెక్టర్లు, సీజీఎంలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతీ సంవత్సరం మే మొదటి వారంలో విద్యుత్‌ భద్రతా వారోత్సవాలు నిర్వహించడంతో పాటు సిబ్బందికి, ప్రజలకు విద్యుత్‌ ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతీ సర్కిల్‌, డివిజన్‌, సబ్‌ డివిజన్‌లో విద్యుత్‌ విని యోగదారులకు, రైతులకు విద్యుత్‌ భద్రత ప్రాముఖ్యతను వివరించాలన్నారు. విద్యుత్‌ ప్రమాదాలను నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ సిబ్బందితో సమావేశాలు నిర్వహించాలని ఎస్‌ఈలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ డైరెక్టర్లు బి.అశో క్‌ కుమార్‌, టి.సదర్‌ లాల్‌, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్‌, సీఈలు తిరుమల్‌ రావు, రాజుచౌహాన్‌, అశోక్‌, బికంసింగ్‌, వెంకట రమణ, జాయింట్‌ సెక్రటరి కె.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి

విద్యుత్‌ భద్రతా వారోత్సవాల పోస్టర్‌ ఆవిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement