
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
పాలకుర్తి టౌన్: మండల కేంద్రం రాజీవ్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు అంశం ఘర్షణకు దారితీసింది. రోడ్డు విస్తరణలో భాగంగా చౌరస్తాలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న, తెలంగాణ తల్లి విగ్రహాలను రెండేళ్ల క్రితం తొలగించి పోలీస్టేషన్లో భద్రపరిచారు. పనులు పూర్తయ్యాక చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న విగ్రహాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన గద్దైపెనే నూతనంగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ నాయకులు శనివారం స్లాబ్ వేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు వచ్చి తమ ప్రభుత్వం రూపొందించిన పాత విగ్రహమే ఏర్పాటు చేయాలని స్లాబ్ను కూల్చివేశారు. సమాచారం అందుకున్న వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని నాయకులను చెదరగొట్టారు. దీంతో అదే ప్రదేశంలో బైఠాయించి నిరసన తెలుపగా కొందరిని అరెస్ట్ చేశా రు. ఈ క్రమంలో స్లాబ్ కూల్చిన ప్రదేశంలో కాంగ్రెస్ నాయకులు పనులను పునరుద్ధరించడానికి పూనుకోగా బీఆర్ఎస్ నాయకులు చేరుకున్నారు. ఇరువర్గాలు కర్రలతో దాడి చేసుకోవడానికి సిద్ధమవగా పోలీసులు వారిని చెదరగొట్టారు. అనంతరం బందోబస్తు మధ్య స్లాబ్ పనులు తిరిగి మొదలు పెట్టారు. ఈ ఘటన నేపథ్యంలో గంట పాటు ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పసునూని నవీన్, మాజీ జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్రావు, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ బొబ్బాల అశోక్రెడ్డి మాట్లాడుతూ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశామని, దానిపై కాంగ్రెస్ నాయకులు కొత్త విగ్రహం ఏర్పా టు చేస్తే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయులు సురేష్నాయక్, మహేందర్, పాపారావు, బాలు నాయక్, దిండిగాల వెంకన్న, బెల్లి సోమన్న తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటులో వివాదం
కొత్త విగ్రహం ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్..
పాత విగ్రహమే కావాలన్న బీఆర్ఎస్ నాయకులు
స్లాబ్ నిర్మాణం కూల్చివేత.. ఇరువర్గాల ఘర్షణ.. పరిస్థితి ఉద్రిక్తం