
వైభవంగా వార కల్యాణం
చిల్పూరు: శ్రీ బుగులు వెంకటేశ్వరస్వామి సన్నిధిలో శనివారం వార కల్యాణాన్ని అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచా ర్యులు వైభవంగా నిర్వహించారు. హనుమకొండకు చెందిన అడెపు శ్రీనగేష్–శ్వేత, పింగిళి మధుపాల్రెడ్డి–ప్రేమలత భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్ తదితరులు పాల్గొన్నారు.
తాళ్లపెల్లి నరేష్గౌడ్కు డాక్టరేట్
జఫర్గఢ్: షాపల్లికి చెంది న తాళ్లపెల్లి నరేష్గౌడ్కు కాకతీయ విశ్వవిద్యాల యం డాక్టరేట్ ప్రకటించింది. ‘స్టేట్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏ స్టడీ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ’ అనే అంశంపై పొలిటికల్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ పోరిక సమ్మూలాల్ పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసినందుకు డాక్టరేట్ ప్రకటించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
కూచిపూడిలో ఆదిత్రి ప్రతిభ
చిల్పూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిలకలూరిపేట కళా నిలయం వారు ఇటీవల నిర్వహించిన 40వ అంతర్జాతీయ నృత్యకళా పోటీల్లో చిల్పూరు మండలం వెంకటాద్రిపేటకు చెందిన ఏమాండ్ల రాజనర్సింహారెడ్డి–రమ దంపతుల కూతురు ఆదిత్రిరెడ్డి కూచిపూడి చంద్ర కేటగిరి(5 నుంచి 14 ఏళ్ల లోపు)లో స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది. ఆదిత్రి ప్రస్తుతం కరీంనగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. ఈ సందర్భంగా ఆమెను గ్రామానికి చెందిన చల్లా రాజమహేందర్రెడ్డి, కందుల రఘుపతి, జంగం యాదగిరి, ఎన్నకూస కుమార్, వలబోజు బ్రహ్మచారి, గుర్రపు విజయ్కుమార్, చొల్లేటి రాజేశ్వరశర్మ తదితరులు అభినందించారు.

వైభవంగా వార కల్యాణం

వైభవంగా వార కల్యాణం