
నిబంధనల మేరకు పంట రుణాలివ్వాలి
స్టేషన్ఘన్పూర్: స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రిజర్వ్ బ్యాంకు నిబంధనల మేరకు రైతులకు పంట రుణాలు అందించాలని తెలంగాణ రైతు సంఘం జి ల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య డి మాండ్ చేశారు. రైతాంగ సమస్యల పరి ష్కారానికి తెలంగాణ రైతు సంఘం ఆ ధ్వర్యంలో ఈనెల 5, 6వ తేదీల్లో బ్యాంకుల ఎదుట ధర్నాలు, 11న తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని మండలంలోని ఇప్పగూడెంలో ఆదివారం చేపట్టారు. రైతు సంఘం మండల కార్యదర్శి లింగనబోయిన కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన సోమయ్య మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతులు, రైతు సంఘం బాధ్యులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాసు ప్రభాకర్, ఎల్.సుధాకర్, బక్క సోమయ్య, కుమార్, గట్టయ్య, మంకయ్య, ఉప్పలయ్య, గోపయ్య, గట్టుమల్లు, లక్ష్మయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.